‘గౌతమ్ నంద’ తరువాత యాక్షన్ హీరో గోపీచంద్, దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్లో మరో చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో గోపీచంద్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా నటించనుంది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్న ఈ చిత్రం… త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా… తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి ‘ సీటీ మార్’ అనే టైటిల్ని ఖరారు చేశారని తెలిసింది. త్వరలోనే ఈ టైటిల్పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే… గోపీచంద్ రా ఏజెంట్ గా నటించిన ‘చాణక్య’ విజయదశమి కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. మెహరీన్, జరీన్ ఖాన్ కథానాయికలుగా నటించిన ఈ యాక్షన్ డ్రామాకి తిరు దర్శకత్వం వహించాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: