అతిలోకసుందరి శ్రీదేవి నట వారసురాలిగా ‘ధడక్’ చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్… ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటికే కరణ్ జోహార్ నిర్మాణంలో ‘కార్గిల్ గాళ్’లో నటిస్తున్న జాన్వి… ఆ తరువాత కూడా కరణ్ జోహార్ నిర్మాణంలోనే ‘దోస్తానా 2’లో కథానాయికగా నటించనుంది. అలాగే… కరణ్ జోహార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న హిస్టారికల్ డ్రామా ‘తఖ్త్’లోనూ కీలకపాత్ర పోషించనుంది జాన్వి. అంతేకాదు… కరణ్ జోహార్ నిర్మించనున్న మరో చిత్రంలోనూ జాన్వి నాయికగా నటించనుందని సమాచారం. బేజోయ్ నంబియార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ రొమాంటిక్ థ్రిల్లర్లో తన ఫస్ట్ మూవీ హీరో ఇషాన్ ఖత్తర్తో ఆడి పాడనుందట ఈ భామ. మొత్తానికి… తన మెంటర్ కరణ్ జోహార్ ప్రోత్సాహంతో పలు ఆసక్తికరమైన చిత్రాల్లో భాగమవుతూ టాక్ ఆఫ్ బాలీవుడ్ అవుతోంది జాన్వి.
మరోవైపు… రాజ్కుమార్ రావ్ హీరోగా తెరకెక్కుతున్న హారర్ కామెడీ మూవీ ‘రూహీ అఫ్జా’లోనూ కథానాయికగా నటిస్తోంది జాన్వి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉన్న సంగతి తెలిసిందే.
[subscribe]
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.