నితిన్, నిత్యా మీనన్ స్టారర్ `గుండెజారి గల్లంతయ్యిందే`(2013)తో దర్శకుడిగా తొలి అడుగులు వేశాడు కొండా విజయ్ కుమార్. మొదటి ప్రయత్నంలోనే ఘనవిజయం అందుకున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్… ఆ తరువాత `ఒక లైలా కోసం` (2014)తో పలకరించాడు. నాగచైతన్య, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. ఈ నేపథ్యంలో… ఐదేళ్ళ సుదీర్ఘ విరామం తరువాత మరో సినిమాని తెరకెక్కించేందుకు సన్నద్ధమయ్యాడు. రాజ్ తరుణ్ హీరోగా కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఆగస్టు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్కి వెళ్ళనుందని సమాచారం. కాగా, వినిపిస్తున్న కథనాల ప్రకారం… తన కంటే వయసులో పెద్దదైన అమ్మాయిని ప్రేమించే ఓ హైపర్ యాక్టివ్ కుర్రాడి కథతో ఈ చిత్రం తెరకెక్కుతోందని తెలిసింది. అంతేకాదు… నితిన్ `గుండెజారి గల్లంతయ్యిందే` తరహాలోనే `కామెడీ ఆఫ్ ఎర్రర్స్` స్క్రీన్ప్లేతో ఈ సినిమా సాగుతుందని సమాచారం. మరి… `గుండెజారి…` ఫార్ములా మరోసారి వర్కవుట్ అయి కొండా విజయ్ కుమార్ మళ్ళీ సక్సెస్ ట్రాక్లోకి వస్తాడేమో చూద్దాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[subscribe]
[youtube_video videoid=emvCTKoG6Hs]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: