భారత అంతరిక్ష సంస్థ ఇస్రో మార్స్ గ్రహం పైకి ప్రయోగించిన మంగళ్ యాన్ ఉపగ్రహం సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా “మిషన్ మంగళ్”. జగన్ శక్తి దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో అక్షయ్ కుమార్, విద్యాబాలన్, తాప్సీ, నిత్యా మేనన్, సోనాక్షి సిన్హా, శర్మన్ జోషి, కీర్తి కుల్హరి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ సైంటిస్ట్ రాకేష్ ధావన్ పాత్రలో అక్షయ్ కుమార్ నటించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు చిత్రయూనిట్. ‘మంగళ్యాన్’ ప్రయోగం చేపట్టే సమయంలో చోటుచేసుకున్న ఆసక్తికర సంఘటనలతో ఈ సినిమాను రూపొందించినట్లు టీజర్ బట్టి తెలుస్తోంది.
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్ట్ 15న రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అయితే అదే రోజు భారీ బడ్జెట్ మూవీ ‘సాహో’ రిలీజ్ అవుతుండటంతో.. ఆగస్టు 15న కాకుండా ఒక వారం ముందుగా అంటే ఆగస్టు 9న విడుదల చేయాలని ఆ చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు. మరి చూద్దాం ఏ రోజు ఫిక్స్ చేసుకుంటారో..
[youtube_video videoid=SPZJFnym8Q0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: