గత కొద్ది వారాలుగా నిస్తేజంగా ఉన్న బాక్సాఫీస్ని ఉత్తేజపరుస్తూ… మూడు వరుస వారాల్లో ఆసక్తికరమైన చిత్రాలు విడుదలై విజయకేతనం ఎగరవేశాయి. ఆ సినిమాలే… జూన్ 21న విడుదలైన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, జూన్ 28న రిలీజైన ‘బ్రోచేవారెవరురా’, జూలై 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఓ బేబీ’. వేర్వేరు జానర్స్లో వచ్చిన ఈ మూడు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ కూడా కామెడీ బ్యాక్డ్రాప్లో తెరకెక్కినవే కావడం విశేషం. అలాగే ఎమోషన్స్కు కూడా ఎలాంటి లోటు రాకుండా ఆడియన్స్ను ఎంటర్టైన్ చేయడంలో విజయం సాధించాయి ఈ మూడు చిత్రాలు. అందుకే… ఈ చిత్ర త్రయాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఏదేమైనా… మూడు వారాల పాటు వరుసగా వారానికో విజయం దక్కడం చిత్రపరిశ్రమకి ఉత్సాహాన్నిచ్చే అంశమే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో… ఈ వారం అంటే జూలై 12న కూడా పలు ఇంట్రెస్టింగ్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అవే ‘దొరసాని’, ‘నిను వీడని నీడను నేనే’, ‘రాజ్దూత్’, ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’, `కె.ఎస్. 100`. డిఫరెంట్ జానర్లలో రూపొందిన ఈ నాలుగు చిత్రాలు… గత మూడు వారాలుగా సాగుతున్న విజయపరంపరను కొనసాగిస్తాయేమో చూడాలి. ఆల్ ది బెస్ట్ టు దిస్ వీక్ రిలీజెస్!
[youtube_video videoid=1O2EhScuV2g]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: