‘దేవి’(1999)చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకి సంగీత దర్శకుడిగా పరిచయమయ్యాడు దేవిశ్రీ ప్రసాద్. టాలీవుడ్ లో డీఎస్పి అని ముద్దుగా పిలుచుకునే ఈ టాలీవుడ్ రాక్ స్టార్… గత రెండు దశాబ్దాలుగా తన స్వరాలతో సంగీత ప్రియులను అలరిస్తూనే ఉన్నాడు. ఓ పక్క అగ్ర కథానాయకుల సినిమాలకు సంగీతం అందిస్తూనే… మరోవైపు యంగ్ హీరోస్ చిత్రాలకి కూడా తనదైన మార్కు బాణీలతో ఆకట్టుకుంటున్నాడు. ఇదిలా ఉంటే… ఇప్పుడు మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకునేందుకు అడుగు దూరంలో ఉన్నాడీ ఈ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… ‘ఆర్య’ (అల్లు అర్జున్), ‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్. (చిరంజీవి),’ ‘జల్సా’ (పవన్ కల్యాణ్), ‘ఎవడు’(రామ్ చరణ్ తేజ్), ‘ఎఫ్-2’(వరుణ్ తేజ్)… ఇలా ఈ మెగా హీరోలతో దేవిశ్రీ ఫస్ట్ టైం కలిసి పనిచేసిన సినిమాలన్నీ మ్యూజికల్ గాను… కమర్షియల్ గాను మెప్పించాయి. ఈ నేపథ్యంలో మరో మెగా హీరో సాయి తేజ్ హీరోగా నటించిన ‘చిత్రలహరి’ సినిమా కోసం తొలిసారిగా సాయి తేజ్ తో కలిసి పనిచేసాడు దేవిశ్రీ. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని పాటలు శ్రోతలను అలరిస్తున్నాయి. ఈ శుక్రవారం (ఏప్రిల్ 12న) ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటి సాయి తేజ్ కి మరపురాని చిత్రంగా మారుతుందేమో చూడాలి.
[subscribe]
[youtube_video videoid=QvSP5gJkKg0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: