కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా వచ్చిన `కె.జి.ఎఫ్- చాప్టర్ 1` సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కన్నడలోనే కాదు.. తెలుగులో కూడా ఈ సినిమా మంచి సక్సెస్ ను అందుకుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రఖ్యాత హోంబలే ఫిలింస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దాదాపు 250 కోట్లు వసూలు చేసి రికార్డులు సృష్టించగా, కన్నడలో 100 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం హిందీలో సుమారు 50 కోట్లు వసూలు చేసింది. అలాగే తెలుగు రాష్ట్రాల్లోనూ అద్భుత వసూళ్లు సాధించింది. తెలుగులో వారాహి చలనచిత్రం అధినేత .. సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఆ సినిమాకు వచ్చిన క్రేజ్ తోనే సీక్వెల్ ను కూడా ప్లాన్ చేసినట్టు గత కొద్దిరోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నేడు ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. బెంగళూరు కంఠీరవ స్టూడియోస్లో ఉదయం 9.20 గంటలకు పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను ప్రారంభించారు. ఈ నెలాఖరు నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తారు. అక్టోబర్ కల్లా షూటింగ్ పూర్తి చేసి.. నవంబర్, డిసెంబర్ నెలల్లో గ్రాఫిక్స్ పనులు, ఇతర పనులు కంప్లీట్ చేసి.. వచ్చే ఏడాది ప్రథమార్థంలో సినిమాను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ నిర్మాత కైకాల సత్యనారాయణ, నిర్మాత కిరంగదూర్, దర్శకుడు ప్రశాంత్ నీల్, రాకింగ్ స్టార్ యశ్, కథానాయిక శ్రీనిధి శెట్టి తదితరులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యశ్ మాట్లాడుతూ.. కెజిఎఫ్ చాప్టర్ 1 చిత్రాన్ని ఎంతో ప్రేమించి అభిమానించిన అభిమానులకు చాప్టర్ 2 డబుల్ ట్రీట్ ఇస్తుందని తెలిపారు. మరి చూద్దాం ఆ అంచనాలను ఈ సినిమా రీచ్ అవుతుందో?లేదో?
[youtube_video videoid=_ElvQ7C-xxU]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: