బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా ఆర్అర్అర్. డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకోగా.. మూడో షెడ్యూల్ కూడా త్వరలోనే జరుపుకోనున్నారు. కోల్ కత్తాలో దాదాపు 40 రోజుల పాటు ఇద్దరు హీరోలతో రాజమౌళి ఈ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాకు రాజమౌళి ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి నే సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆ వర్క్ కూడా స్టార్ట్ చేసినట్టు ఇటీవలే కీరవాణి ట్వీట్ ద్వారా కూడా తెలిపారు. ఇప్పుడు తాజాగా ప్రముఖ లిరిసిస్ట్ సుద్దాల అశోక్ తేజ కూడా ఆర్ఆర్ఆర్ టీమ్ లో జాయిన్ అయినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని కూడా కీరవాణి తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఆర్ఆర్ఆర్ కోసం ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ తేజ గారు పాట రాస్తున్నారు. ఆయన చాలా ఫాస్ట్ అండ్ బ్రిలియంట్ కూడా అని తన ట్వీట్లో తెలిపారు కీరవాణి.
కాగా ఈ సినిమాను భారీ బడ్జెట్ తో డివివి ఎంటర్ టైన్మెంట్స్ పతాకం ఫై డివివి దానయ్య నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు తో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో కూడా విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. మరి రేపు ఆర్ఆర్ఆర్ టీమ్ ప్రెస్ మీట్ లో పాల్గొనబోతుంది. ఈ నేపథ్యంలో పలు విషయాలపై ఉన్న అనుమానాలకు క్లారిటీ ఇస్తారేమో చూద్దాం.
[youtube_video videoid=-fIckspYhns]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: