కామెడీ చిత్రాల దర్శకుడు జీ నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా కొత్త సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే కదా. తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక గత కొద్ది కాలంగా కర్నూల్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అక్కడి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాా సమాచారం ప్రకారం సందీప్ కిషన్ మరోసారి కర్నూల్ కి వెళ్లనున్నాడు. ఈ నెల 7 వ తేదీ నుండి అక్కడ ఈ సినిమా షూటింగ్ జరుపుకోనుంది. అంతేకాదు ఇటీవలే హార్ట్ సర్జజీ చేయించుకొని కోలుకున్న కామెడీ కింగ్ బ్రహ్మానందం ఈసినిమాతో మరోసారి ఎంట్రీ ఇవ్వనున్నారు.
ఇక గత కొద్దికాలంగా తెలుగు సినిమాలకు కాస్త దూరమైన హన్సిక ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో వెన్నెల కిషోర్, మురళి శర్మ, పృథ్వీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎస్ఎన్ఎస్ క్రియేషన్స్ బ్యానర్పై తెరకెక్కుతన్న ఈ మొదటి సినిమాను అగ్రహారం నాగిరెడ్డి, సంజీవు రెడ్డి నిర్మిస్తున్నారు.
[youtube_video videoid=8VSYF73nG6M]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: