దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూసిన ‘పుష్ప 2: ది రూల్’ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆదివారం బీహార్ రాజధాని పాట్నా వేదికగా గ్రాండ్గా జరిగిన ఈవెంట్లో ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులనే కాకుండా యావత్ సినీ ప్రియులను అలరిస్తోంది. ప్రస్తుతం ఇది యూట్యూబ్లో సెన్సేషన్ సృష్టిస్తూ అత్యధిక వ్యూస్తో దూసుకుపోతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో పుష్ప 2 ట్రైలర్పై టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్. రాజామౌళి స్పందించారు. ఈ మేరకు ఆయన తాజాగా తన ఎక్స్లో దీనిపై ఒక స్పెషల్ పోస్ట్ పెట్టారు. “పాట్నాలో వైల్డ్ ఫైర్ మొదలైంది. అది దేశమంతటా విస్తరిస్తోంది. డిసెంబర్ 5న చెలరేగుతోంది. పార్టీ కోసం వెయిట్ చేయలేకపోతున్నా పుష్ప” అని అందులో పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం రాజమౌళి పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఇక ఇదిలావుంటే మరికొందరు సినీ ప్రముఖులు కూడా పుష్ప 2 ట్రైలర్ చూసి రెస్పాండ్ అవుతున్నారు. అల్లు అర్జున్, రష్మిక మందన్న నటనను మెచ్చుకుంటున్నారు. అలాగే చిత్ర దర్శకుడు సుకుమార్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. వీరిలో దర్శకులు ప్రశాంత్ వర్మ, హారీశ్ శంకర్, బాబీ, అనిల్ రావిపూడి ఇంకా ‘కాంతార’ ఫేమ్ నటుడు రిషబ్ శెట్టి, ప్రొడ్యూసర్ నాగవంశీ తదితరులు సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































