రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు, వరదలతో ప్రజలు అనేక ఇక్కట్లకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు తెలుగు చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖులు ముందుకొస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ, ఎన్టీఆర్, విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ, త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు వైజయంతి మూవీస్, గీతా ఆర్ట్స్, హాసిని అండ్ హారిక క్రియేషన్స్ తదితర నిర్మాణ సంస్థలు భూరి విరాళాలను ప్రకటించిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ క్రమంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ విపత్తుపై స్పందించారు. తన వంతు సాయంగా వరద బాధితుల కోసం భారీ విరాళం ప్రకటించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఒక్కోదానికి రూ.50 లక్షల చొప్పున, కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఈ మేరకి సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన ఆయన.. ఈ మొత్తాన్ని ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్)కి అందజేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























