శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న ‘మృత్యుంజయ్’ చిత్ర టీజర్ తాజాగా విడుదలై ప్రేక్షకుల్లో అమితాసక్తిని రేకెత్తిస్తోంది. అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ఈ టీజర్ ను లాంచ్ చేశారు. ఒక నిమిషానికి పైగా నిడివి ఉన్న ఈ టీజర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా, గ్రిప్పింగ్ విజువల్స్తో సాగింది. ఒక నిగూఢమైన రహస్యాన్ని ఛేదించే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా శ్రీవిష్ణు కనిపించిన తీరు, ఆయన సీరియస్ మేనరిజమ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కాల భైరవ అందించిన నేపథ్య సంగీతం టీజర్కు ప్రాణం పోసిందని చెప్పవచ్చు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
విజువల్స్ చాలా డార్క్గా, ఇంటెన్స్గా ఉండి పక్కా క్రైమ్ థ్రిల్లర్ మూడ్ను సెట్ చేశాయి. దర్శకుడు హుస్సేన్ షా కిరణ్ మేకింగ్ స్టైల్ చాలా ఫ్రెష్గా కనిపిస్తోంది. శ్రీవిష్ణు మరోసారి కంటెంట్ ఉన్న వైవిధ్యమైన కథను ఎంచుకున్నాడు. ఫిబ్రవరి 27న విడుదల కానున్న ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు ఒక సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ అనుభూతిని ఇస్తుందనే నమ్మకాన్ని ఈ టీజర్ కలిగించింది.సందీప్ గుణ్ణం , వినయ్ చిలకపాటి ఈసినిమాను నిర్మిస్తున్నారు.
ఇందులో రెబా మోనికా జాన్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుంది.ఇంతకుముందు శ్రీ విష్ణు ,రెబా కలిసి సామజవరగమన లో నటించగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. మరి మృత్యుంజయ్ కి కూడా ఆ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























