ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో నటించిన మిస్టిక్ థ్రిల్లర్ మూవీ ‘శంబాల’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. గతేడాది డిసెంబర్లో థియేటర్లలో విడుదలై 20కోట్ల వసూళ్లతో సూపర్ హిట్ అందుకున్న ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహా’ దక్కించుకుంది. ఇక ఈ సినిమా జనవరి 22 నుండి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. అయితే ‘ఆహా గోల్డ్’ సబ్స్క్రిప్షన్ ఉన్న వినియోగదారులకు ఒక రోజు ముందుగానే, అంటే జనవరి 21 నుండే ఈ సినిమా అందుబాటులోకి రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా కథాంశం 1980వ దశకం నేపథ్యంలో సాగుతుంది. వెయ్యేళ్ల చరిత్ర ఉన్న ‘శంబాల’ అనే గ్రామంలో ఆకాశం నుండి ఒక ఉల్క పడటంతో కథ మొదలవుతుంది. ఆ తర్వాత ఆ ఊరిలో వరుసగా వింత సంఘటనలు, హత్యలు, ఆత్మహత్యలు జరుగుతుంటాయి. ఆ ఊరి ప్రజలు ఇదంతా ఒక బండ భూతం వల్ల జరుగుతోందని భయపడతారు. ఈ రహస్యాలను ఛేదించేందుకు ప్రభుత్వం విక్రమ్ (ఆది సాయికుమార్) అనే యువ శాస్త్రవేత్తను అక్కడికి పంపిస్తుంది. సైన్స్ను నమ్మే విక్రమ్, ఆ ఊరిలో జరుగుతున్న వింతల వెనుక అసలు కారణాలను ఎలా కనుగొన్నాడు? మూఢ నమ్మకాలకు, సైన్స్కు మధ్య జరిగిన ఈ సంఘర్షణలో విక్రమ్ గెలిచాడా లేదా? అన్నదే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం.
యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అర్చన అయ్యర్ హీరోయిన్గా నటించింది. ఆది సాయికుమార్ తన కెరీర్లో చేసిన ఒక విభిన్నమైన ప్రయత్నంగా ఈ సినిమా గుర్తింపు పొందింది. అంతేకాదు ఈసినిమా తో చాలా ఏళ్ళ తరువాత విజయాన్ని అందుకొని ఫామ్ లోకి వచ్చాడు.థియేటర్లలో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈసినిమా ఈ సినిమా ఓటీటీలో కూడా మంచి వ్యూస్ రాబట్టుకోనుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























