బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సోలో హీరోగా నెక్స్ట్ మిస్టీరియస్ అకల్ట్ థ్రిల్లర్ కిష్కింధపురి తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.అనుపమ పరమేశ్వరన్ ఇందులో హీరోయిన్ గా నటించగా చావు కబురు చల్లగా ఫేమ్ కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు.షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి నిర్మించారు.ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచింది.ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది.ఇక ఈరోజు ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇందులో ప్రొడ్యూసర్ సాహు గారపాటి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం.ట్రైలర్ కి ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. మేము ఎలాగైతే ఎక్సైట్ అయ్యామో ఆడియన్స్ కూడా అదే రకంగా ఎక్సైట్ అయ్యారు. ఈ సినిమా మీ అంచనాలకు తగ్గకుండా ఉంటుంది.సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నాం.ఖచ్చితంగా ఆడియన్స్ కి సినిమా నచ్చుతుంది.మా హీరో హీరోయిన్ టీమ్ అందరూ చాలా కష్టపడి పని చేశారు. వారి కష్టానికి మంచి గుర్తింపు తెచ్చే సినిమా అవుతుంది.సెప్టెంబర్ 12న ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నానని అన్నారు.
అలాగే మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్ మాట్లాడుతూ..అందరికి నమస్కారం.చాలా కొత్తగా చేసిన సినిమా ఇది. ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు.మన నిర్మాత సాహు గారు చాలా ప్యాషన్ తో చాలా బిగ్ స్కేల్ లో ఈ సినిమా చేశారు. మా మ్యూజిక్ టీమ్ అందరికీ థాంక్యు.సినిమాలో చాలా హై మూమెంట్స్ ఉన్నాయి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసినప్పుడు చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. సెప్టెంబర్ 12 సినిమా వస్తుంది.ఖచ్చితంగా థియేటర్స్ లో చూడండి. మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఉంటుందన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 
తెలుగుతమిళ్కన్నడమలయాళండబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























