బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ భైరవం టీజర్, పాటలు, ప్రమోషనల్ కంటెంట్కు అద్భుత స్పందనతో, పాజిటివ్ బజ్తో ముందుకు దూసుకెళ్తోంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్పై కె.కె. రాధామోహన్ భారీగా నిర్మించారు. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతీలాల్ గడా సమర్పిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా మే 30న వేసవి సీజన్లో బిగ్గెస్ట్ రిలీజ్కి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మూవీ టీం థియేట్రికల్ ట్రైలర్ ఏలూరులో గ్రాండ్గా లాంచ్ చేశారు. భారీ సంఖ్యలో అభిమానులు ప్రేక్షకులు హాజరైన ఈ వేడుక చాలా సక్సెస్ ఫుల్గా జరిగింది. ఏపీ సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ పుట్ట మహేష్, ఎమ్మెల్యేలు రాధాకృష్ణయ్య, చింతమనేని ప్రభాకర్ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా చిత్ర కథానాయికల్లో ఒకరైన అదితి శంకర్ మాట్లాడుతూ.. “అందరికి నమస్కారం. ఈ సినిమాతో తెలుగులోకి రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్యూ. ఈ క్యారెక్టర్ని చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. సాయి శ్రీనివాస్ గారు, రోహిత్ గారు, మనోజ్ గారితో కలిసి నటించడం వండర్ఫుల్ ఎక్స్పీరియెన్స్. ట్రైలర్ అదిరిపోయింది. తప్పకుండా ఈ సినిమాని థియేటర్లో చూడండి. మీ అందరికీ వండర్ఫుల్ ఎక్స్పీరియెన్స్ ఇస్తుంది” అని చెప్పారు.
అలాగే మరో హీరోయిన్ ఆనంది మాట్లాడుతూ.. “ట్రైలర్ని ఏలూరులో లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. డైరెక్టర్ విజయ గారితో వర్క్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. రాధా మోహన్ గారు చాలా పాషన్తో ఈ సినిమా నిర్మించారు సాయి శ్రీనివాస్ గారితో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన డాన్స్కి నేను పెద్ద ఫ్యాన్ని. మనోజ్ గారు, రోహిత్ గారు స్వీటెస్ట్ పర్సన్స్. ఈ సినిమా వండర్ఫుల్ ఎక్స్పీరియెన్స్” అని తెలిపారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: