కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు, ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ సమ్మర్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ #సింగిల్. కేతిక శర్మ, ఇవానా కథానాయికలుగా నటించారు, వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్తో కలిసి చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మే 9న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా అందరినీ అలరించి సమ్మర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ లో మూవీ టీం అంతా పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా నటుడు
వెన్నెల కిషోర్ చిత్ర యూనిట్ మరియు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.
వెన్నెల కిషోర్ ఏమన్నారంటే.. “అందరికి నమస్కారం. అల్లు అరవింద్ గారితో టైం స్పెండ్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను. ఆయన ప్రతి సమస్యకి అద్భుతమైన సొల్యూషన్ ఇస్తారు. డైరెక్టర్ కార్తీక్ వెరీ జెన్యూన్ పర్సన్. సినిమాని చాలా హానెస్ట్ గా తీశారు. శ్రీ విష్ణు గారితో జర్నీ మర్చిపోలేను. ఈ సినిమా మొదట స్టార్ట్ అయినప్పటి నుంచి ఇందులో సెకండ్ హీరో మీరే అని చెప్పారు.”
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “శ్రీ విష్ణు లాంటి వ్యక్తి చాలా అరుదు. ఆయన లేకపోతే అరవింద్ క్యారెక్టర్ కి ఇంత మంచి ఎలివేషన్ రాదు. ఆయనతో మరిన్ని సినిమాలో పనిచేయాలని ఉంది. ఇవాన కేతిక ఫెంటాస్టిక్ గా పెర్ఫార్మ్ చేశారు. నిర్మాతలకి థాంక్యూ టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు” అని అన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: