బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ఆర్. మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ హిస్టారికల్ కోర్ట్ డ్రామా ‘కేసరి ఛాప్టర్ 2: ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్వాలా బాగ్’. ఏప్రిల్ 18న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతూ, ఇప్పటికే రూ.100 కోట్ల వసూళ్లు సాధించి ప్రస్తుతం నాలుగో వారంలోను హౌస్ ఫుల్గా రన్ అవుతుంది. ఎమోషన్స్తో నిండిన కోర్ట్ సన్నివేశాల్లో వారి నటనకు విశేష ప్రశంసలు లభించాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే హిందీ వర్షన్కు విమర్శకుల ప్రశంసలతో పాటు భారీ వసూళ్లు రావడంతో, తెలుగు ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ఇప్పుడు తెలుగులోకి డబ్ చేయబడి మే 23న విడుదల కాబోతుంది. సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రముఖ సంస్థ ఈ సినిమాను విడుదల చేయడం వల్ల, తెలుగు రాష్ట్రాల్లో దీన్ని భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ‘కేసరి ఛాప్టర్ 2’తో ప్రేక్షకులకు పవర్ ఫుల్ సినిమాటిక్ ఎక్స్పీరియెన్స్ అందించబోతుంది.
కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, మాధవన్ ప్రధానపాత్రల్లో నటించగా.. అనన్య పాండే, రెజీనా కసండ్రా ఫిమేల్ లీడ్ రోల్స్ ప్లే చేశారు. హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో హిందీలో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 18న విడుదలై ఘనవిజయం సాధించింది. పలువురు ప్రముఖులు దీనిపై ప్రశంసలు కురిపించారు.
కాగా ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టును ధర్మా ప్రొడక్షన్స్, లియో మీడియా కలెక్టివ్, కేప్ ఆఫ్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లపై నిర్మాతలు హీరూ యష్ జోహర్, అరుణా భాటియా, కరణ్ జోహర్, అపూర్వ మెహతా, అమృత్ పాల్ సింగ్ బింద్రా సంయుక్తంగా నిర్మించారు. సాష్వత్ సచ్దేవ్ సంగీతం సమకూర్చగా.. దేబోజిత్ రే సినిమాటోగ్రఫీ, నితిన్ బేద్ ఎడిటింగ్ అందించారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: