కోలీవుడ్ అగ్ర కథానాయకుడు అజిత్ కుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘విడాముయార్చి’. త్రిష కృష్ణన్ కథానాయికగా నటించగా.. యాక్షన్ కింగ్ అర్జున్ ఓ కీలక పాత్రలో కనిపించారు. అలాగే ఆరవ్, రెజీనా కసాండ్ర, నిఖిల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఆద్యంతం ఆకట్టుకునే ఎంటర్టైన్మెంట్ చిత్రాలతో పాటు విలక్షణమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడిగా పేరున్న మగిళ్ తిరుమేని అజిత్తో భారీ చిత్రాన్ని తెరకెక్కించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా తెలుగులో ‘పట్టుదల’ పేరుతో విడుదలయింది. అనౌన్స్మెంట్ రోజు నుంచే భారీ అంచనాలు ఏర్పడిన ఈ చిత్రం రీసెంట్గా ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో అజిత్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్లో స్టైలిష్గా కనిపించి సందడి చేశారు. అలాగే రాక్ స్టార్ అనిరుద్ చార్ట్బస్టర్ ఆల్బమ్ సినిమాకు ప్లస్ అయింది. థియేటర్లలో ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.
దీంతో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కోసం మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా శాటిలైట్ హక్కులను సన్ టీవీ సొంతం చేసుకోగా, ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా పట్టుదల సినిమా స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసింది నెట్ఫ్లిక్స్ సంస్థ. మార్చి 3వ తేదీ నుంచి ఈ మూవీ తెమిళం సహా తెలుగు, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుంది.
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో స్టార్స్తో భారీ బడ్జెట్ చిత్రాలు, డిఫరెంట్ కంటెంట్ బేస్డ్ సినిమాలను నిర్మిస్తోన్న టాప్ ప్రొడక్షన్ హౌస్ లైకా ప్రొడక్షన్స్ సంస్థ అధినేత సుభాస్కరన్.. విడాముయార్చి సినిమాను గ్రాండ్గా నిర్మించారు. ఇక ఈ చిత్రానికి ఓం ప్రకాష్ సినిమాటోగ్రాఫర్గా, ఎన్.బి.శ్రీకాంత్ ఎడిటర్గా, మిలాన్ ఆర్ట్ డైరెక్టర్గా వర్క్ చేశారు. ఇంకా సుందర్ స్టంట్స్, అను వర్ధన్ కాస్ట్యూమ్స్ డిజైనర్గా పని చేశారు.
పట్టుదల కథ ఏంటంటే..?
అజర్ బైజాన్ దేశంలోని బాకు నగరంలో కథానాయకుడైన అర్జున్ (అజిత్ కుమార్), కాయల్ (త్రిష) ని ప్రేమ వివాహం చేసుకుని జీవిస్తుంటాడు. 12 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాలతో భర్తతో విడిపోవాలనుకుంటుంది కాయల్. అంతే కాదు మరో వ్యక్తితో ప్రేమలో పడుతుంది. దీంతో విడాకులకు అర్జున్ అంగీకరిస్తాడు. అయితే ఈలోగా తన పుట్టింట్లోనే ఉండాలనుకుని నిర్ణయించుకుంటుంది.
ఈ క్రమంలో తానే స్వయంగా పుట్టింట్లో డ్రాప్ చేస్తానని, ఇదే మనం కలిసి చేసే చివరి మెమరబుల్ జర్నీ అని చెప్పి అర్జున్ కాయల్ను కారులో తీసుకెళ్తాడు. ఈ ప్రయాణంలో వారికి మార్గ మధ్యంలో దీపికా (రెజీనా), రక్షిత్ (అర్జున్) పరిచయమవుతారు. అయితే ఆ తర్వాత కాయల్ మిస్ అవుతుంది. అక్కడి నుంచి ఏం జరిగింది. దీని వెనుక ఉన్నది ఎవరు? కిడ్నాప్ అయిన తన భార్య కాయల్ను అర్జున్ ఎలా దక్కించుకున్నాడు అన్నది కథ.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: