టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో శర్వానంద్ తన ల్యాండ్మార్క్ 35వ మూవీ ‘మనమే’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై రామ్సే స్టూడియోస్ ప్రొడక్షన్లో నిర్మాత టిజి విశ్వప్రసాద్ అత్యంత గ్రాండ్గా నిర్మించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్గా నటించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్తో హ్యుజ్ బజ్ని క్రియేట్ చేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో ‘మనమే’ నేడు (శుక్రవారం,జూన్ 7) థియేటర్లలో గ్రాండ్గా విడుదలయింది. ఈ క్రమంలో మేకర్స్ అంతకుముందు ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ శర్వానంద్కు ‘ఛార్మింగ్ స్టార్’ టైటిల్ ఇచ్చారు. ఈ మేరకు రూపొందించిన స్పెషల్ వీడియోను ఈవెంట్లో ప్రజెంట్ చేశారు. గ్రాండ్గా జరిగిన ఈ వేడుకలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ మారుతి, శివ నిర్వాణ, సాయి రాజేష్, కిషోర్ తిరుమల అతిధులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ టీజీ విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. నిన్న మన సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశాం. ఇది కంటిన్యూ చేస్తూ.. మనమే గ్రేట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అలరిస్తుంది. ఈ సినిమా చూశాను. అద్భుతంగా వచ్చింది. శర్వా పెర్ఫార్మెన్స్ ఎక్స్ట్రార్డినరీగా వుంది. తన ఛార్మింగ్ లుక్స్, పెర్ఫార్మన్స్ చూసి తనకి ‘ఛార్మింగ్ స్టార్’ అనే టైటిల్ ఇస్తున్నాను. మనమే అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాం. దిని సక్సెస్ మీట్ ఆంధ్రప్రదేశ్లో చాలా గ్రాండ్గా చేస్తాం. సక్సెస్ మీట్లో మరింత మాట్లాడుకుందాం” అని అన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: