ఇప్పడు రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఆ కోవలోనే 2012, మార్చి 23న విడుదలై యూత్ఫుల్ ఎంటర్టైనర్ కుర్రకారుని ఆకట్టుకుని సంచలన విజయం సాధించిన చిత్రం ‘ఈ రోజుల్లో’. ప్రస్తుతం టాలీవుడ్ లో రీరిలీజ్ ల కాలం నడుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రాన్ని మళ్లీ విడుదల చేస్తున్నారు మేకర్స్. సినిమా విడుదలైన 12 సంవత్సరాలకు మళ్లీ అదే రోజు అంటే మార్చి 23నే ఈ చిత్రం రీరిలీజ్ కావడం విశేషం. ఎన్నో సంచలనాలకు తెరలేపిన ట్రెండ్సెట్టర్ ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ను మళ్లీ చూడాలని అందరూ కోరుకుంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్ పై క్రియేటివ్ దర్శకుడు మారుతీ డైరెక్షన్లో వచ్చిన సినిమా ‘ఈ రోజుల్లో’. శ్రీనివాస్, రేష్మ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకి జేబి సంగీతం అందించాడు. ఎస్కేఎన్, శ్రేయాస్ శ్రీనివాస్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం ఈరోజు మళ్ళీ విడుదల అవుతోంది. ఈ సందర్బంగా శుక్రవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ.. “మా ముగ్గురి కెరీర్లో ఇది చాలా ప్రత్యకమైన సినిమా. పీఆర్ ఓగా వున్న నన్ను నిర్మాతను చేసిన సినిమా ఇది. మా అందరిని బిజీ చేసిన ట్రెండ్సెట్టర్ సినిమా ఇది. తెలుగు సినీ పరిశ్రమకు మారుతి లాంటి ప్రతిభ గల దర్శకుడిని అందించిన సినిమా ఈ రోజుల్లో. ఆ రోజున మొదలైన మా ప్రయాణంలో అందరికి మంచి కెరీర్ను ఇచ్చిన సినిమా ఇది” అని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ “ఈ రోజుల్లో నుంచి బేబీ వరకు నిర్మాతగా నాప్రయాణం, దర్శకుడిగా మారుతి ప్రస్థానం, శ్రీనివాస్ కెరీర్ ఎంతో సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది. ఇది కేవలం రిరిలీజ్ మాత్రమే కాదు. పుష్కర కాలంలో మా కెరీర్లో ఎలా ఎదిగాం అని చూసుకునే తీపి గుర్తు ఈ సినిమా. ఈ సినిమా విడుదలైన తరువాత సినీ పరిశ్రమలో 50 లక్షలతో ఎలా సినిమా తీశారు.. అంటూ మా ప్రతిభను గుర్తించారు. ఎంతో మంది వాళ్ల సహకారం అందించారు. ఇలాంటి సినిమా మళ్లీ వెండితెరపై చూసుకోవడం ఆనందంగా వుంది అన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: