ఒకప్పటి ప్రముఖ బాలీవుడ్ నటి, ప్రస్తుత హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా జోనాస్ భారత్లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆమె ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యలో నూతనంగా నిర్మించిన శ్రీ రాముడి మందిరాన్ని సందర్శించారు. ఈ మేరకు బుధవారం అయోధ్య రామాలయం వద్దకు వచ్చిన ప్రియాంక.. భర్త, నిక్ జోనాస్ మరియు కుమార్తె మాల్టీ మేరీ జోనాస్లతో కలిసి రామ్ లల్లా (బాల రాముడి)ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ దంపతులు శ్రీ రాముడికి ప్రత్యేక పూజలు చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ క్రమంలో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ప్రియాంక చోప్రా దంపతులతో సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు అక్కడికి వచ్చిన భక్తులు కొందరు ఆసక్తి చూపారు. ఇక ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆలయ కమిటీ, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేయగా.. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ప్రియాంక చోప్రా హాలీవుడ్ సింగర్ నిక్ జోనాస్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: