టాలీవుడ్ ట్యాలెంటెడ్ నటులు శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన క్రేజీ చిత్రం ‘ఓం భీమ్ బుష్’. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకి ‘హుషారు’ ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి ఈ సినిమాని నిర్మిస్తుండగా, అగ్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సగర్వంగా సమర్పిస్తోంది. ఇక ఇప్పటికే రిలీజైన ఈ మూవీ టీజర్, ఫస్ట్ సింగిల్ పాజిటివ్ ఇంప్రెషన్ని క్రియేట్ చేసింది. ఈ చిత్రం మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ‘ఓం భీమ్ బుష్’ థియేట్రికల్ ట్రైలర్ను లాంచ్ చేశారు. కాగా చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్గా జరిగింది. ఈ సందర్భంగా నటుడు ప్రియదర్శి మాట్లాడుతూ.. “మార్చి 22 తప్పకుండా అందరూ థియేటర్స్ కి రండి. డబుల్ డోస్ ఎంటర్ టైన్మెంట్ ఇస్తామని ప్రామిస్ చేస్తున్నాం. నిర్మాతలు వంశీ గారు, సునీల్ గారు చాలా సపోర్ట్ చేశారు. వారి ప్రోత్సాహం వలనే ఇంత క్రేజీ సినిమా చేయగలిగాం. తప్పకుండా సినిమా మీ అందరినీ అలరిస్తుంది’’ అని అన్నారు.
ఇక దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి మాట్లాడుతూ.. ట్రైలర్ లో వుండే ఎనర్జీ కంటే సినిమాలో వందరెట్ల ఎనర్జీ వుంటుంది. మార్చి 22న అందరూ గ్యాంగ్స్ తో రండి. టెన్ టైమ్స్ ఎంటర్ టైన్ అవుతారు. అది మా గ్యారెంటీ. మార్చి 22న కలుద్దాం’’ అని చెప్పారు. చిత్ర నిర్మాత సునీల్ బలుసు మాట్లాడుతూ.. ” ‘ఓం భీమ్ బుష్’ మార్చి 22న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తప్పకుండా అందరూ చూడాలి’’ అని కోరారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: