క్రాక్,వీరసింహా రెడ్డి తో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బాస్టర్ సినిమాలను ఇచ్చాడు డైరెక్టర్ గోపిచంద్ మలినేని.ఇంత సూపర్ ఫామ్ లో వున్న ఈ డైరెక్టర్ నెక్స్ట్ మూవీ విషయం లో మాత్రం ఆలస్యం అవుతుంది.వీరసింహా రెడ్డి తరువాత మైత్రి మూవీస్ లోనే గోపీచంద్ మలినేని,రవితేజతో సినిమా చేయనున్నాడని అనౌన్స్మెంట్ వచ్చింది.అయితే ఎందుకో తెలియదు షూటింగ్ కు కూడా వెళ్లకముందే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది దాంతో ఆ ఆతరువాత గోపిచంద్ బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ కు కథ వినిపించి ఓకే చేయించుకున్నాడని మైత్రినే ఈసినిమా నిర్మించనుందని వార్తలు వచ్చాయి అయితే దీనిపై ఎలాంటి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈరోజు గోపిచంద్ బర్త్ డే సందర్బంగా ఓ అప్డేట్ ఇచ్చారు మైత్రి నిర్మాతలు.గోపిచంద్ ను విష్ చేస్తూ తన డైరెక్షన్ లో ఓ హ్యూజ్ న్సేషనల్ మూవీ షేప్ అప్ అవుతుంది త్వరలోనే ఆసినిమాను అనౌన్స్ చేస్తామని మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించింది.దాంతో గోపిచంద్ మలినేని నెక్స్ట్ మూవీ మైత్రి లోనే ఉండనుందని క్లారిటీ వచ్చింది.మరి ఈసినిమాకు సన్నీ డియోల్ ను ఎంచుకుంటారో లేదా టాలీవుడ్ పెద్ద హీరో ఎవరితోనైనా చేస్తారో త్వరలోనే క్లారిటీ రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: