బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’ చిత్రంతో గతేడాది మంచి హిట్ అందుకున్నారు. మనీశ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీలో స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కథానాయికగా నటించగా.. ఇమ్రాన్ హష్మి విలన్గా కనిపించారు. దేశభక్తి కథాంశంగా రూపొందిన ఈ సినిమా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ వరుసగా సినిమాలను చేయడానికి సిద్ధమవుతున్నారు. దీనిలో భాగంగా ఆయన తాజాగా తన తదుపరి చిత్రానికి సంబంధించి కీలక అప్డేట్ అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తమిళ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్తో కొత్త సినిమా చేయనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు సల్మాన్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించారు. కాగా ఈ మూవీని ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాడ్వాలా నిర్మించనున్నారు. సల్మాన్ కెరీర్లో సూపర్ హిట్ చిత్రాలు ‘కిక్’, ‘జుడ్వా’ సాజిద్ నిర్మించినవే. ఇక ‘కిక్’ సినిమాకు సాజిద్ దర్శకత్వం వహించడం విశేషం. ఈ నేపథ్యంలో వీరిద్దరూ కలిసి మరో మూవీ చేయనుండటం.. దానికి ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్ చేయనుండటంతో చిత్రంపై అంచనాలు నెలకొన్నాయి. దీనితో పాటుగా సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్తో కలిసి ‘టైగర్ వర్సెస్ పఠాన్’ చిత్రంలోనూ నటించనున్నారు.
Glad to join forces with the exceptionally talented, @ARMurugadoss and my friend, #SajidNadiadwala for a very exciting film !! This collaboration is special, and I look forward to this journey with your love and blessings. Releasing EID 2025.@NGEMovies @WardaNadiadwala pic.twitter.com/dv00nbEBU1
— Salman Khan (@BeingSalmanKhan) March 12, 2024
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: