పుష్ప ఫ్రాంచైజ్‌ షురూ.. మూడో పార్టుపై హింట్ ఇచ్చిన అల్లు అర్జున్‌

Allu Arjun Sets Franchise Plans For Pushpa, Says Part 2 Has Huge Canvas

టాలీవుడ్ హీరో, ఐకాస్ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప: ది రైజ్‌’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బాలీవుడ్‌లో సైతం సత్తా చాటిన ఈ మూవీ హిందీ బెల్ట్‌లో రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. అయితే ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాను ఒక ఫ్రాంచైజ్‌ తరహాలో ప్లాన్ చేస్తున్నామని ప్రకటించారు హీరో అల్లు అర్జున్‌ . ఈ మేరకు ఆయన ఇటీవలే ఆయన బెర్లిన్ ఇంట‌ర్‌నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో పాల్గొనడం కోసం జర్మనీ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఇంట‌ర్‌నేష‌న్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌కు ఇండియ‌న్ ప్ర‌తినిధిగా అల్లు అర్జున్ హాజరయ్యారు. అలాగే ఫెస్టివ‌ల్‌లో భాగంగా పుష్ప సినిమాను స్క్రీనింగ్ చేయడం గమనార్హం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ క్రమంలో హాలీవుడ్ ప్రముఖ మేగజైన్ ‘వెరైటీ’ అల్లు అర్జున్ తో ప్రత్యేకంగా మాట్లాడింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుష్ప సినిమాకు మూడో పార్ట్ కూడా ఉంటుంద‌ని వెల్లడించారు. అలాగే పుష్ప సినిమా థియేట‌ర్లలో కంటే ఓటీటీలోనే ఎక్కువ‌గా ప్రేక్షకులకు రీచ్ అయ్యింద‌ని, ఓటీటీలో స్ట్రీమింగ్ కారణంగా ఈ సినిమాకు ఇంట‌ర్‌నేష‌న‌ల్ వైడ్‌గా క్రేజ్ ఏర్ప‌డి 2021లో బిగ్గెస్ట్ ఫిల్మ్‌గా పుష్ప నిలిచింద‌ని అల్లు అర్జున్ పేర్కొన్నారు. ఇక పుష్ప పార్ట్ 2లో పుష్ప‌రాజ్‌ పాత్రలో డిఫ‌రెంట్ షేడ్‌ను చూస్తార‌ని, తొలిభాగానికి మించి ఈ క్యారెక్ట‌రైజేష‌న్ హై లెవెల్‌లో ఉంటుంద‌ని తెలిపారు. పుష్పను రీజ‌న‌ల్ లెవెల్‌లో తెర‌కెక్కించామ‌ని, అయితే ఇప్పుడు పుష్ప 2ను మాత్రం ఇంట‌ర్‌సేష‌న‌ల్ స్టాండ‌ర్డ్స్‌తో రూపొందిస్తున్నామ‌ని చెప్పారు.

కాగా ప్రస్తుతం పుష్ప మూవీకి సీక్వెల్‌గా ‘పుష్ప 2: ది రూల్’ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా అల్లు అర్జున్‌ సరసన కథానాయికగా నటిస్తుండగా.. సునీల్, రావు రమేష్, అనసూయ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ప్రముఖ మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా చేస్తుండగా.. టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ‘పుష్ప 2: ది రూల్’ సినిమా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. పుష్ప 2 మూవీ ఆగ‌స్ట్ 15న పాన్ ఇండియా లెవెల్‌లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × one =