టాలీవుడ్లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ భార్య రూహీ మృతి చెందారు. గత కొన్ని రోజులుగా కొన్ని అనారోగ్య సమస్యలతో ఆమె సికింద్రాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా కోవిడ్ 19 కారణంగా రూహీ కొంతకాలంగా పలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈ సమస్యలు తీవ్రతరం కావడంతో.. సికింద్రాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబసభ్యులు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ క్రమంలో ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. రూహీకి మల్టీపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యాయని, దీంతో పరిస్థితి విషమించి కన్నుముశారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 2009లో సెంథిల్ కుమార్, రూహీలు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వారికి ర్యాన్ కార్తికేయన్, ధృవ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా రూహీ వృత్తిరీత్యా యోగా శిక్షకురాలు. కెరీర్ తొలినాళ్లలో ఆమె యోగా టీచర్ అయిన ప్రముఖ హీరోయిన్ అనుష్క శెట్టి దగ్గర కొంత కాలం పాటు పని చేశారు.
Renowned @DOPSenthilKumar’s wife, Yoga Exponent @ruheeYogi, has passed away due to health issues.
May her soul rest in peace🙏#RIPRoohi #OmShanti #TeluguFilmNagar pic.twitter.com/abaKbm1XvG— Telugu FilmNagar (@telugufilmnagar) February 15, 2024
ఇక రూహీ మరణం తెలుగు చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. రూహీ మరణ వార్త తెలిసిన వారంతా.. రూహీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ.. సెంథిల్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. కాగా.. రూహీ అంత్యక్రియలను శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో నిర్వహించనున్నారని సమాచారం. కాగా దర్శకుధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన అత్యధిక చిత్రాలకు సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్గా పనిచేసిన విషయం సినీ ప్రియులకు తెలిసిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: