సౌత్ సినీ ఇండస్ట్రీ ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు తెచ్చుకుంటున్న సంగతి తెలిసిందే కదా. విభిన్నమైన సినిమాలను చేస్తూ దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచ ప్రేక్షకులను సైతం అలరిస్తున్నారు. అందుకే ఒకప్పటికే పోల్చుకుంటే సౌత్ సినిమాలకు ఇప్పుడు మార్కెట్ బాగా పెరిగింది. ఇదిలా ఉంటే బాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితి ఇప్పుడు మారింది. ఒకప్పుడు హాలీవుడ్ తరువాత బాలీవుడ్ అన్నట్టు ఉండేది.. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కరోనా తరువాత బాలీవుడ్ ఇంకాస్త వెనుకపడిపోయింది. మళ్లీ ఇప్పుడిప్పుడే విజయాలను అందుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా సౌత్ క్రేజ్ పై ఇప్పటికే బాలీవుడ్ నుండి పలువురు సెలబ్రిటీలు తమ అభిప్రాయాలను బయటపెట్టిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు తాజాగా ఇమ్రాన్ హష్మీ కూడా సౌత్ మేకర్స్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సౌత్ ఫిలిం మేకర్స్ క్రమశిక్షణ తో ఉంటారు.. సినిమా కోసం వారు ఖర్చు చేసే ప్రతి రూపాయి తెరపై కనిపిస్తుంది. హిందీ సినిమాల్లో ఒక్కోసారి అనవసరమైన చోట్ల ఎక్కువ ఖర్చు పెడుతున్నారని అనిపిస్తుంటుంది.ఇక VFX మరియు పాత్ బ్రేకింగ్ కథల విషయాల్లో అయితే సౌత్ సినిమా చిత్రనిర్మాతలు మనకంటే ముందున్నారని తెలిపారు.
కాగా ఇమ్రాన్ హష్మీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో ప్రియాంక అరుళ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. రవి..కె.చంద్రన్ డీవోపీ అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: