ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రోజురోజుకీ అడ్వాన్స్ అవుతోంది. అయితే దీనిని మంచిపనులకు వినియోగిస్తే ఎలాంటి అభ్యంతరం లేదు. మనుషులకు ఉపయుక్తంగా ఉండాల్సిన ఈ టెక్నాలజీని కొందరు తమ స్వార్ధాలకు వాడుకుంటున్నారు. ఇటీవలికాలంలో సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. సాధారణ వ్యక్తులనుంచి ప్రముఖులు సైతం ఈ మోసాల బారినపడి నష్టపోతున్నారు. అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి టాలీవుడ్ ఇండస్ట్రీలో చోటుచేసుకుంది. సైబర్ మోసగాళ్లు ఎంచుకుంది ఎవరో కాదు.. ఏకంగా టాలీవుడ్ లోని అగ్రహీరో కుటుంబాన్నే టార్గెట్ చేశారు ఈ కేటుగాళ్లు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వివరాల్లోకి వెళ్తే.. సూపర్ స్టార్ మహేష్ బాబు తనయ సితార పేరుతో కొందరు వ్యక్తులు మోసాలకు పాల్పడుతున్నారు. సితార ఘట్టమనేని పేరుతో ఇన్స్టాగ్రామ్లో నకిలీ ఖాతాలు తెరిచిన ఈ మోసగాళ్లు.. బిజినెస్ ఇన్వెస్ట్మెంట్, షేర్ మార్కెట్ ట్రేడింగ్ లింకులు పలువురికి పంపుతున్నారు. అయితే దీనిని గమనించిన మహేష్ బాబు టీమ్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్ నెటిజెన్లను అప్రమత్తం చేసింది. సితార ఘట్టమనేని పేరుతో వచ్చే ఇలాంటి వాటిని నమ్మొద్దని ఆ సంస్థ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేసింది. అంతేకాకుండా ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జీఎంబీ ఎంటర్టైన్మెంట్ సంస్థ హైదరాబాద్ లోని మాదాపుర్ పోలీస్ స్టేషన్లో దీనిపై ఫిర్యాదు చేసింది.
Attention! pic.twitter.com/6tX9yNQT5G
— GMB Entertainment (@GMBents) February 9, 2024
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: