ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘యాత్ర 2’. మహీ వి. రాఘవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గతంలో వచ్చిన ‘యాత్ర’ మూవీకి సీక్వెల్గా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ మూవీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి (వైఎస్సార్) పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తుండగా.. ఆయన తనయుడు వైఎస్ జగన్గా ప్రముఖ తమిళ నటుడు జీవా నటిస్తున్నారు. ఇప్పటికే ‘యాత్ర 2’ నుంచి వచ్చిన మోషన్ పోస్టర్, ఫస్ట్లుక్, టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. యాత్ర 2 మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ మేరకు మేకర్స్ ముందుగా ప్రకటించినట్లు శనివారం సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ముఖ్యంగా ఇందులో జీవా నటన హైలైట్ అని చెప్పొచ్చు. వైఎస్ జగన్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. సీఎం జగన్ హావభావాలు, నడక, డైలాగ్ డెలివరీ.. ఇలా ప్రతి ఒక్కటీ జీవా పూర్తిగా ఆయనను అనుకరించడం గమనార్హం. ఈ ట్రైలర్ చూసాక యాత్ర 2 సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.
Ichina maata kosam, yuddhaniki ayina #𝗦𝗜𝗗𝗗𝗛𝗔𝗠 ✊🏻#Yatra2Trailer 👣 Out Now – https://t.co/36MYTKA97D
Directed by @mahivraghav
In cinemas from Feb 8th#LegacyLivesOn #Yatra2 #Yatra2OnFeb8th @JiivaOfficial pic.twitter.com/ddEinI7l4h
— Mammootty (@mammukka) February 3, 2024
కాగా ‘యాత్ర 2’లో ప్రధానంగా సీఎం జగన్ రాజకీయ రంగప్రవేశం, అందుకు దారి తీసిన పరిస్థితులు, సొంతంగా వైఎస్సార్సీపీ పార్టీని స్థాపించడం, ప్రతిపక్షనాయకుడిగా ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి పాదయాత్ర చేయడం.. ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం వంటివాటిని చూపించనున్నారు. ఈ సినిమాను త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ బ్యానర్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తుండగా.. ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: