ప్రముఖ మలయాళ నటుడు టోవినో థామస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘నడిగర్’. లాల్ జెఆర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఈ క్రమంలో మలయాళ యూత్లో మంచి క్రేజ్ ఉన్న నటుడు టోవినో థామస్ హీరోగా ‘నడిగర్’ సినిమాను నిర్మిస్తోంది. తెలుగులో ఎన్నో హిట్ సినిమాలను అందించిన మైత్రీ మూవీ మేకర్స్.. తాజాగా నడిగర్ చిత్రంతో మాలీవుడ్లో సైతం తన ప్రస్థానాన్ని కొనసాగించేందుకు సిద్ధమైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇటీవలే నడిగర్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టర్లో హీరో టోవినో థామస్ సహా ఈ చిత్రంలో నటిస్తోన్న నటీనటులందరి లుక్స్ రివీల్ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రానికి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. నడిగర్ మూవీ రిలీజ్ డేట్ వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా మే 3వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు ప్రకటించింది.
Get ready for a blast ❤️🔥#Nadikar, arriving in style on 3rd May 2024 Worldwide.#Tovino #SoubinShahir #BaluBarghese #Bhavana #Laljr #SureshKrishna #Nadikar @ttovino @Godspeedoffcl @thinkmusicindia @truthglobalofcl pic.twitter.com/LJR2nSwfDQ
— Mythri Movie Makers (@MythriOfficial) February 3, 2024
ఇక విలక్షణ కథలకు పెట్టింది పేరైన మాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వస్తోన్న చిత్రం కావడం, అందునా హీరో టోవినో థామస్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. కాగా ఈ ఏడాది ప్రారంభంలో టాలీవుడ్ అగ్ర నటులు మెగాస్టార్ చిరంజీవితో ‘వాల్తేరు వీరయ్య’, నందమూరి బాలకృష్ణతో ‘వీరసింహారెడ్డి’ సినిమాలతో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ బ్లాక్బస్టర్ హిట్లు కొట్టిన విషయం తెలిసిందే.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: