టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘హనుమాన్’ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. పండుగ బరిలో పలు స్టార్ హీరోల చిత్రాల మధ్య చిన్న సినిమాగా విడుదలై అనూహ్యంగా సూపర్ సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ.270 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రూ. 300 కోట్ల దిశగా దూసుకుపోతోంది. ఇక ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమా చూసి సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందాన్ని ప్రశంసిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తాజాగా ప్రశాంత్ వర్మ టీమ్ ఒక ప్రకటన చేసింది. హనుమాన్ సినిమా ఒక అరుదైన రికార్డ్ క్రియేట్ చేసిందని తెలిపింది. టాలీవుడ్లో సంక్రాంతికి రిలీజైన సినిమాలలో బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచిందని ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా.. “92 సంవత్సరాల తెలుగు చిత్రపరిశ్రమలో ‘హనుమాన్’ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకూ వచ్చిన తెలుగు సినిమాలలో ఆల్-టైమ్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది” అని హనుమాన్ యూనిట్ అందులో పేర్కొంది.
కాగా హనుమాన్ చిత్రంలో తేజ సజ్జా సరసన అమృతా అయ్యర్ హీరోయిన్గా నటించింది. కోలీవుడ్ స్టార్స్ వరలక్ష్మీ శరత్ కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ కూడా రానున్నట్లు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆల్రెడీ ప్రకటించారు. దీనికి ‘జై హనుమాన్’ అనే టైటిల్ పెడుతున్నట్లు హనుమాన్ ఎండింగ్లోనే స్పష్టం చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ అయినట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి సాలిడ్ అప్డేట్ రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: