బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్కి ఈ ఏడాది బాగా కలిసి వచ్చింది. ఏడాది ఆరంభంలో ‘పఠాన్’.. ఆ తర్వాత ‘జవాన్’ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు కింగ్ ఖాన్. ఇండియాలో మరే హీరోకు సాధ్యం కాని విధంగా ఆయన నటించిన ఈ రెండు సినిమాలు రూ.1,000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ సృష్టించాయి. దీనిని కొనసాగిస్తూ తాజాగా షారుఖ్ త్వరలోనే మరో కొత్త సినిమా ‘డంకీ’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో షారుఖ్ సరసన తాప్సీ పన్ను హీరోయిన్గా నటిస్తుండగా.. విక్కీ కౌశల్, బొమన్ ఇరానీ ఇతర కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 21న ‘డంకీ’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో షారుక్ ఖాన్ జమ్ము-కశ్మీర్ లోని ప్రసిద్ధి చెందిన మాతా వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బాలీవుడ్ బాద్షా వైష్ణో దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. కాగా, ఏడాదిలో వైష్ణోదేవి ఆలయాన్ని షారుఖ్ సందర్శించడం ఇది మూడోసారి. గతంలో ‘పఠాన్’ మూవీ రిలీజ్కు ముందు మరియు ‘జవాన్’ విడుదల సమయంలో కూడా కింగ్ ఖాన్ ఈ ఆలయాన్ని సందర్శించారు. ఆ రెండు చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు అదే సెంటిమెంట్తో మరో 9 రోజుల్లో ‘డంకీ’ సినిమా రిలీజ్ కానున్న క్రమంలో మరోసారి ఆయన వైష్ణోదేవిని దర్శించుకున్నారు. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో షారుఖ్ అభిమానులు ‘డంకీ’ చిత్రం ఘనవిజయం సాధించడం పక్కా అని భావిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: