టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో నితిన్ నటిస్తోన్న తాజా చిత్రం ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రానికి సీనియర్ రైటర్ కమ్ డైరెక్టర్, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ ఫేమ్ వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. అలాగే సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ మరియు ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా.. తాజాగా హీరో నితిన్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ నుంచి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అందుకున్నారు. ఆ వ్యక్తి మరెవరో కాదు, టీమిండియా మాజీ కెప్టెన్, లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీ. అవును ధోనీ తన సైన్ చేసి ఉన్న టీ షర్ట్ను నితిన్కు బహుమతిగా అందించారు. ఇక ఈ సర్ప్రైజ్ గిఫ్ట్పై నితిన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అందులో.. “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ నుంచి ఎక్స్ట్రా ఆర్డినరీ గిఫ్ట్. ఇది అందించినందుకు థాంక్యూ ధోనీ సర్. లవ్ యూ” అంటూ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా ధోనీ పంపించిన టీ షర్ట్ పట్టుకొని దిగిన ఫోటోను పంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ పిక్ ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది. దీంతో నితిన్, ధోనీని ఎప్పుడు కలిశాడు? ఎలా కలిడు? అని నెటిజెన్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
EXTRA special moment for @actor_nithiin as he receives best wishes from iconic legend in the field of cricket, @msdhoni!👌#Nithiin #MSDhoni #ExtraOrdinaryMan #TeluguFilmNagar pic.twitter.com/0VC0PAQnKG
— Telugu FilmNagar (@telugufilmnagar) November 29, 2023
కాగా ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ మూవీ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన డేంజర్ పిల్లా, బ్రష్ వేసుకో పాటలు మ్యూజిక్ లవర్స్ను ఇంప్రెస్ చేస్తున్నాయి. ఇదే క్రమంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ చేయగా.. మాంచి కామెడీ అండ్ యాక్షన్ కంటెంట్ తో ప్రేక్షకులను అలరించింది. దీని తర్వాత మూవీపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. ఇక షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్కు సిద్ధంగా ఉంది. డిసెంబర్ 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానున్న నేపథ్యంలో.. ప్రస్తుతం మూవీ టీమ్ ప్రమోషన్స్లో బిజీగా ఉంది. ఇదిలా ఉండగా.. మరోవైపు వెంకీ కుడుముల డైరెక్షన్లో నితిన్ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ పై నవీన్ యేర్నేని, వై రవి శంకర్ సంయుక్తంగా తెరకెక్కిస్తుండగా.. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: