ఒకప్పుడు సినిమాలు థియేటర్లలో 100 రోజులు ఆడుతుండేవి. కొన్ని సినిమాలు 200 రోజులు ఆడేవి. అలాగే ఇంకొన్ని చిత్రాలైతే ఏకంగా ఏడాది రన్ అవుతుండేవి. అయితే, ఇదంతా గతం, కాలం మారింది. నేటి ఫాస్ట్ యుగంలో ఎంత పెద్ద సినిమా అయినా 2 వారాలు థియేటర్లలో నడిచిందంటే సూపర్ హిట్ అయినట్లే. ఏదైనా సినిమా 20 రోజులు ఆడిందంటే బ్లాక్ బస్టర్ అన్నట్లు భావిస్తున్నారు. దీనికి కారణాలు అనేకం. ప్రేక్షకుల ఆలోచనా సరళి మారడం, ఎంటర్టైన్మెంట్ కోసం బోలెడన్ని ఆప్షన్స్ ఉండటం, వివిధ భాషల సినిమాలను తెలుగులో అందించే ఓటీటీలు, దాదాపు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్స్.. ఇలా ఎన్నో కారణాలు. ఇక వీటికి తోడు వెబ్ సైట్లలో రివ్యూలు. సినిమా విడుదలైన గంట లోపే అది బావుందా? లేదా? అని రకరకాల విశ్లేషణలు సర్వసాధారణం అయిపొయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో.. టాలీవుడ్ స్టార్ హీరో నితిన్ ఈ రివ్యూలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ డిసెంబరు 8న ప్రేక్షకుల ముందుకు రానున్న క్రమంలో ఒక ఇంటర్వ్యూలో భాగంగా నితిన్ ఇలా పేర్కొన్నారు.. రివ్యూస్ మంచివా, కాదా అనే విషయం పక్కన పెడితే, సినిమాలపై రివ్యూలు రాయడం, రేటింగ్స్ ఇవ్వడం వంటివి స్టార్ట్ అయ్యాక డైరెక్టర్లలో మార్పు వచ్చింది. క్రిటిక్స్ చేసే విమర్శలకు భయపడి చాలా మంది ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేస్తున్నారు. ఒకప్పుడు మేం కూడా కొన్ని సీన్స్ చేసేటప్పుడు లాజిక్ లేకుండా చేసేవాళ్ళం. కానీ, ఆడియెన్స్ కి సినిమాలపై అవగాహన పెరగడం మరియు రివ్యూలలో ఇలాంటివాటిని ఎక్కువగా హైలైట్ చేయడం కారణంగా.. డైరెక్టర్స్ కొంచెం రియాలిటీకి దగ్గరగా ఉండేలా తీస్తున్నారు” అని పేర్కొన్నారు.
అయితే చాలామంది ఇండస్ట్రీ జనాలు ఈ రివ్యూలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే.. నితిన్ మాత్రం ఇలా దీనిపై పాజిటివ్ గా మాట్లాడటం గమనార్హం. కాగా యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ చిత్రానికి సీనియర్ రైటర్ కమ్ డైరెక్టర్, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ ఫేమ్ వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. అలాగే సీనియర్ హీరో రాజశేఖర్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ మరియు ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్డ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: