కోలీవుడ్ టాప్ హీరోలు సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు ఉలగనాయగన్ కమల్ హాసన్ ఇరువురూ ఒకే ఫ్రేమ్లో కనిపించి సందడి చేశారు. ఈ మేరకు శుక్రవారం ఈ స్టార్ హీరోలు ఇద్దరూ 2 దశాబ్దాల తర్వాత చెన్నైలోని ఒకే స్టూడియోలో తమ కొత్త సినిమాలకు సంబంధించిన షూటింగ్ను జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ అద్భుత దృశ్యం కనిపించింది. ఈ సందర్భంగా ఈ రెండు చిత్రాల నిర్మాణ సంస్థ అయిన లైకా ప్రొడక్షన్స్ సోషల్ మీడియా వేదికగా ఇందుకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేసింది. అందులో కమల్ హాసన్, రజనీకాంత్ ఆప్యాయంగా పలకరించుకుంటూ, నవ్వుతూ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్న ఫోటోలను పంచుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
The 2 unparalleled LEGENDS of Indian Cinema ‘Ulaganayagan’ @ikamalhaasan & ‘Superstar’ @rajinikanth sharing a lighter moment while shooting for their respective films Indian-2 & Thalaivar170 in the same studio after 21 years! 🤗✨
And we @LycaProductions are super happy & proud… pic.twitter.com/8cKcqGwitV
— Lyca Productions (@LycaProductions) November 23, 2023
“భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు అసమాన లెజెండ్స్ ‘ఉలగనాయగన్’ కమల్ హాసన్ మరియు ‘సూపర్ స్టార్’ రజినీకాంత్ 21 సంవత్సరాల తర్వాత ఒకే స్టూడియోలో వారి సంబంధిత చిత్రాలైన ఇండియన్-2 & తలైవర్ 170 షూటింగ్ చేస్తున్నప్పుడు అద్భుతమైన క్షణాలను పంచుకున్నారు! అలాగే ఈ రెండు చిత్రాలను మేము నిర్మిస్తున్నందుకు చాలా సంతోషంగా మరియు గర్వంగా ఉంది” అని లైకా ప్రొడక్షన్స్ పేర్కొంది. కాగా ఈ ఇద్దరు టాప్ స్టార్స్ ఇలా ఒకే ఫ్రేమ్లో కనిపించడంపై ఇరువురి అభిమానులూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా వీరిద్దరూ తమ కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాలలో కలిసి నటించడం గమనార్హం. దీంతో ఈ హీరోల ఫ్యాన్స్ మరోసారి అప్పటి రోజులను గుర్తుచేసుకుంటున్నారు.
ఇక రజినీకాంత్ సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది ‘జైలర్’ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత ప్రస్తుతం ఆయన ‘జై భీమ్’ ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘తలైవర్ 170′ మూవీ చేస్తున్నారు. దీనితో పాటుగా తన కుమార్తె ఐశ్వర్య డైరెక్షన్లో ‘లాల్సలామ్’ అనే సినిమాను చేస్తున్నారు. ఇందులో విష్ణు విశాల్, విక్రాంత్ లీడ్ రోల్స్లో నటిస్తుండగా.. టీమిండియా మాజీ కెప్టెన్ ‘కపిల్ దేవ్’ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందనున్న ‘తలైవర్ 171’లో కూడా నటించనున్నారు రజినీ. ఈ చిత్రాలన్నిటిపై అంచనాలు భారీగా ఉన్నాయి.
మరోవైపు కమల్ హాసన్ కూడా గతేడాది ‘విక్రమ్’ సినిమాతో సక్సెస్ బాట పట్టారు. రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్పై కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మించిన ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. దీని తర్వాత ప్రస్తుతం కమల్, స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్ 2’ సినిమా చేస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ఇంట్రోకు విశేష స్పందన వచింది. 1996లో వచ్చిన ‘ఇండియన్’కి సీక్వెల్ గా వస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: