లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వస్తున్నసినిమా గేమ్ ఛేంజర్. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో వస్తోన్న ఈసినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. అందులో ఒకటి గ్రామీణ పాత్రలో మరొకటి ఐఏఎస్ పాత్రలో నటించబోతున్నాడు. ఇక ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉన్నారు. ఇప్పటికే చాలావరకూ షూటింగ్ ను పూర్తి చేసుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా నుండి మరో అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా కొత్త షెడ్యూల్ ను మైసూర్ లో నేడు స్టార్ట్ చేసినట్టు తెలిపారు. 12 రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూలో లో రామ్ చరణ్, సునీల్, ఎస్ జే సూర్య కూడా పాల్గొననున్నారు. వచ్చే ఏడాది జనవరి కల్లా ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేయాలన్న ప్లాన్ లో ఉన్నారు మేకర్స్.
ఇక ఈసినిమా ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే అప్ డేట్ ఇచ్చారు. దీపావళికి రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ రిలీజ్ న వాయిదా వేశారు. దీంతో మెగా ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అయ్యారు. మరి ఫస్ట్ రిలీజ్ ను ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి.
ఈ సినిమాలో కియారా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: