టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో సినిమా చేయాలని ఉందని, త్వరలోనే అది కార్యరూపం దాల్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు యంగ్ హీరో విశ్వక్ సేన్. అజయ్ భూపతి తాజాగా దర్శకత్వం వహించిన సినిమా ‘మంగళవారం’. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ పాయల్ రాజ్పుత్ ప్రధానపాత్రలో నటించగా.. అజ్మల్, నందితా శ్వేత, ప్రియదర్శి, అజయ్ ఘోష్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. ‘కాంతారా’ ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. నవంబర్ 17న విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ హైదరాబాద్లో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హీరో విశ్వక్ సేన్ స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. “అజయ్ భూపతితో నాకు ఎప్పటి నుంచో పరిచయం. తాను చాలా విభిన్నంగా ఆలోచిస్తాడు. ‘మంగళవారం’లో హీరోయిన్ని హీరోగా చూపించాడు. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తో డాన్స్ చేయించాడు. తరుణ్ భాస్కర్ నాకు ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చిన రెండు రోజుల తర్వాత అజయ్ నాకు ఫోన్ చేసి, ఒక సినిమా కోసం నా ఫొటోలు పంపమని అడిగాడు. అయితే నేను ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాకు ఎంపికైన ఆనందంలో ఆయనకు ఫొటోలు పంపలేదు. ఆ తర్వాత అజయ్, తన రెండో సినిమా ‘మహాసముద్రం’ కథ నాకు చెప్పారు. చేయాలని ఉన్నా.. డేట్స్ ఎడ్జెస్ట్ కాకపోవడంతో అందులో నటించడం కుదరలేదు. ఇక నాకు లుంగీ కట్టుకుని, కత్తి పట్టి యాక్షన్ చేయాలని ఉంది. ఆ కోరిక ప్రస్తుతం చేస్తున్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీతో తీరుతోంది. అజయ్ డైరెక్షన్లో కూడా లుంగీ కట్టుకుని కత్తి పట్టుకోవాలనుకుంటున్నాను. త్వరలోనే అది సాధ్యమవుతుందని కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: