టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్నారు. ఈ మేరకు ఆయన తన తండ్రి, దివంగత నటుడు ఘట్టమనేని కృష్ణ గారి తొలి వర్ధంతి (నవంబర్ 15, 2023) సందర్భంగా.. ఒక మంచి సామాజిక సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలుగు రాష్ట్రాలలోని పలువురు పేద విద్యార్థులకు ఉన్నత చదువులను అందించేందుకు ముందుకొచ్చారు. ఇందుకోసం మహేష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘సూపర్ స్టార్ కృష్ణ ఎడ్యుకేషనల్ ఫండ్’ ప్రోగ్రామ్ను ప్రారంభించారు. కాగా సూపర్ స్టార్ కృష్ణకు నివాళిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మహేష్ బాబు మరియు ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ దంపతులు తెలిపారు. ఇక తాము నిర్వహిస్తున్న ఈ మంచి కార్యక్రమానికి స్ఫూర్తి తమ మామయ్యగారేనని, ఆయన ఆశీస్సులు తమకు ఎల్లవేళలా ఉంటాయని భావిస్తున్నామని నమ్రత పేర్కొన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
As a tribute to Superstar Krishna garu, The Mahesh Babu foundation has recently launched the Superstar Krishna Educational Fund. @urstrulyMahesh pic.twitter.com/wd4WL3KJU5
— Mahesh Babu Foundation (@MBfoundationorg) November 15, 2023
ఈ సందర్భంగా మహేష్ బాబు ఫౌండేషన్ సోషల్ మీడియాలో.. “దీనివలన దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చెందిన 40 మంది మెరిట్ విద్యార్థులకు పాఠశాల విద్య నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుల వరకు ఆర్ధికంగా చేయూత అందించనుంది. ఇది వారి కలలను నెరవేర్చుకోవడానికి దోహదపడుతుంది” అని పేర్కొంది. కాగా ఇప్పటికే మహేష్ బాబు ఎన్నో సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా గత కొన్నేళ్లుగా ఎంతోమంది చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయిస్తున్నారు. అలాగే కృష్ణ స్వగ్రామమైన ఆంధ్రప్రదేశ్ లోని తెనాలి దగ్గరలో గల ‘బుర్రిపాలెం’ గ్రామాన్ని దత్తత తీసుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. కాగా ఇటీవలే విజయవాడలో ప్రముఖ తమిళ్ హీరో కమల్ హాసన్ చేతులమీదుగా కృష్ణ విగ్రహావిష్కరణ ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.
The program supports over 40 merit students ranging from schooling to postgraduate studies, who come from families below the poverty line. It supports children with aspirations by helping them turn their dreams into reality. @urstrulyMahesh
— Mahesh Babu Foundation (@MBfoundationorg) November 15, 2023
ఇక మహేష్ సినిమాల విషయానికొస్తే.. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘గుంటూరు కారం’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాను హారికా & హాసిని క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తుండగా.. నాగవంశీ, హారిక సూర్యదేవర సమర్పిస్తున్నారు. ఈ మూవీలో టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల, మీనాక్షి చౌదరీ హీరోయిన్స్గా నటిస్తున్నారు. అలాగే జగపతిబాబు, జయరామ్, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, సునీల్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇక ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా వచ్చే యేడాది జనవరి 12న పెద్ద ఎత్తున రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: