గుంటూరు కారంలో మహేష్ బాబు క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే? – నమ్రతా శిరోద్కర్

Namrata Shirodkar Interesting Comments on Mahesh Babu Character in Guntur Kaaram

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వస్తోన్న లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’. ‘అతడు’, ‘ఖలేజా’ సినిమాల తర్వాత వీరి కాంబినేషన్‌లో వస్తోన్న మూడో సినిమా కావడం, అలాగే మహేష్ బాబు ఈ చిత్రంలో ఫుల్ మాస్ క్యారెక్టర్ చేస్తుండటంతో ‘గుంటూరు కారం’పై అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో సైతం అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మహేష్ బాబు సతీమణి, ప్రముఖ నటి నమ్రతా శిరోద్కర్ ఈ మూవీకి సంబంధించి కొన్ని కీలక విషయాలను వెల్లడించారు. ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఆమె అక్కడ ఒక మీడియా ప్రతినిధితో కొద్దిసేపు చిట్ చాట్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా నమ్రత ‘గుంటూరు కారం’ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన మహేష్ బాబు న్యూ లుక్ చాలా బావుందని తెలిపారు. అదే విధంగా ఈ మూవీ నుంచి ఇప్పటివరకు రిలీజ్ చేసిన అన్ని పోస్టర్స్ ఆకట్టుకున్నాయని చెప్పారు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ ఎలా ఉండనుందనే ప్రశ్నకు బదులిస్తూ.. ఫుల్ ఫన్ అండ్ ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుందని వివరించారు. అలాగే నవంబర్ 15న సూపర్ స్టార్ కృష్ణ తొలి వర్ధంతి సందర్భంగా ‘మహేష్ బాబు ఫౌండేషన్’ తరపున ఒక నలుగురు పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ అందించనున్నామని, తద్వారా వారి ఫుల్ ఎడ్యుకేషన్ బాధ్యత తాము తీసుకుంటున్నామని తెలియజేశారు. ఇక తాము నిర్వహిస్తున్న ఈ మంచి కార్యక్రమానికి స్ఫూర్తి తమ మామయ్యగారేనని, ఆయన ఆశీస్సులు తమకు ఎల్లవేళలా ఉంటాయని భావిస్తున్నామని నమ్రత పేర్కొన్నారు.

కాగా ఇటీవలే డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ఈ మూవీ నుంచి ఫస్ట్‌ సింగిల్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ‘గుంటూరు కారం’ ఫస్ట్‌ సింగిల్‌ యూట్యూబ్‌లో సెన్సేషన్ సృష్టిస్తోంది. విడుదలైన 24 గంటల్లోనే 19.2 మిలియన్ల వ్యూస్ పైగా సాధించి రికార్డ్ సృష్టించింది. తద్వారా ఒక్క రోజులో అత్యధిక వ్యూస్ సాధించి టాలీవుడ్‌లో ఆల్ టైమ్ రికార్డ్‌గా నిలిచింది. ‘ధమ్‌ మసాలా’ అంటూ సాగే ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. సంజిత్‌ హెగ్డే, జ్యోతి నూరన్‌ ఆలపించారు.

ఇక ‘గుంటూరు కారం’ చిత్రాన్ని హారికా & హాసిని క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తుండగా.. నాగవంశీ, హారిక సూర్యదేవర సమర్పిస్తున్నారు. ఈ మూవీలో టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల, మీనాక్షి చౌదరీ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అలాగే జగపతిబాబు, జయరామ్, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, సునీల్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇక ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా వచ్చే యేడాది జనవరి 12న పెద్ద ఎత్తున రిలీజ్ చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 13 =