ప్రభాస్‌, అల్లు అర్జున్‌ లపై శివ రాజ్‌కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

Shiva Rajkumar Interesting Comments on Prabhas and Allu Arjun

శాండల్‌వుడ్‌గా పేరొందిన కన్నడ చిత్ర పరిశ్రమ ఇటీవల తన స్థాయిని క్రమక్రమంగా పెంచుకుంటోంది. భారీ నిర్మాణ విలువలతో, వినూత్న కథాంశాలతో వస్తున్న అక్కడి సినిమాలు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచుకుంటున్నాయి. ఈ క్రమంలో ‘కేజీఫ్‌’ సిరీస్‌, ‘కాంతారా’ ‘777 చార్లీ’ తదితర సినిమాలు తెలుగులో కూడా రిలీజై ఘనవిజయం సాధించాయి. ఈ సినిమాల తర్వాత కన్నడ పరిశ్రమ టాలీవుడ్‌పై దృష్టి పెట్టింది. అక్కడ హిట్ అయిన సినిమాలతో పాటుగా.. ప్రముఖ హీరోల చిత్రాలను తెలుగులో విడుదల చేయడానికి మేకర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో శివ రాజ్‌కుమార్ కూడా తన కొత్త సినిమాను తెలుగులో రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఘోస్ట్’. ఈ సినిమాలో శివ రాజ్‌కుమార్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించునున్నారు. ఇక అక్టోబర్ 19న ‘ఘోస్ట్’ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఆయన ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా శివ రాజ్‌కుమార్ ట్విట్టర్ లో అభిమానులతో లైవ్ సెషన్ నిర్వహించారు. దీనిలో భాగంగా పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలపై ఈ స్టార్ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో పలువురు టాలీవుడ్ స్టార్ హీరోలపై ఆయన కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రెబల్ స్టార్ ప్రభాస్‌కు శాండల్‌వుడ్‌లోకి సాదర స్వాగతం పలికారు. ఆయనను తామంతా ముక్తకంఠంతో స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు.

కాగా ‘బాహుబలి’ సిరీస్‌తో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్‌ తాజాగా నటించిన చిత్రం ‘సలార్‌’. ‘కేజీఫ్‌’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మూవీ డిసెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. శృతి హాసన్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, ఈశ్వరీరావు, శ్రియారెడ్డి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విజయ్‌ కిరంగదూర్‌ నిర్మిస్తున్నారు.

అలాగే ‘పుష్ప’ సినిమాతో జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న అల్లు అర్జున్ గురించి కూడా శివ రాజ్‌కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘పుష్ప’ సినిమా చూసిన వెంటనే తాను అల్లు అర్జున్‌కు కాల్ చేసి మాట్లాడానని, ఈ సందర్భంగా ఈసారి తప్పకుండా నేషనల్ అవార్డు గెలుస్తావని చెప్పానని గుర్తుచేసుకున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ తన నటనతో ప్రేక్షకులను విశేషంగా అలరించారని, తద్వారా నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు గెలుచుకున్నారని ప్రశంసించారు. అల్లు అర్జున్‌ మరియు ఆయన అభిమానులను తాను ఎల్లప్పుడూ ప్రేమిస్తుంటానని శివ రాజ్‌కుమార్ తెలిపారు.

కాగా ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పుష్ప-2’ చిత్రం షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇందులో బన్నీ ఎర్ర చందనం స్మగ్లర్ గా కనిపిస్తోన్న సంగతి తెలిసిందే. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఫాహద్ ఫాజిల్, జగపతిబాబు, సునీల్, రావు రమేష్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. వచ్చే యేడాది ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో రిలీజ్ కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + 12 =