పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో సముద్రఖని దర్శకత్వంలో వస్తున్న సినిమా బ్రో. ఈసినిమా సముద్రఖని తమిళ్ లో దర్శకత్వంలో వహించిన వినోదయ సీతం అనే సినిమాకు రీమేక్ గా వస్తుంది. మాతృకకు దర్శకత్వం వహించిన సముద్రఖనే ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఇక్కడ తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా స్క్రిప్ట్ లో పలు మాార్పులు కూడా చేశారు. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్, పాటలు అన్నీసినిమాపై అంచనాలను పెంచేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ప్రస్తుతం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంది బ్రో టికెట్ ధరల విషయం గురించి. అందులోనూ ముఖ్యంగా ఏపీలో బ్రో టికెట్ ధరలు ఎలా ఉంటాయా అని చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న టీజీ విశ్వప్రసాద్ బ్రో సినిమా టికెట్ల గురించి మాట్లాడుతూ తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ లో టికెట్ ధరలను పెంచే ఆలోచన లేదని స్పష్టం చేశారు.
ఈసినిమాలో హీరోయిన్ గా కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, ప్రియా ప్రకాష్ వారియర్, రాజా చెంబోలు పలు కీలకపాత్రల్లో నటించనున్నారు. కాగా కాగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈసినిమాకు టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. త్రివిక్రమ్ ఈ సినిమాకు డైలాగులు స్క్రీన్ ప్లే.. థమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: