డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఎనర్జిటిక్ హీరో రామ్ ఈసారి డబల్ ఎంటర్ టైన్మెంట్ తో వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో ఇస్మార్ట్ శంకర్ సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈసినిమాలో రామ్ మునుపెన్నడూ కనిపించని మాస్ అవతార్ కనిపించి అలరించాడు. పూరీ మేకింగ్, పాటలు, రామ్ నటన ఈసినిమాకు మెయిన్ హైలెట్ గా నిలిచి అంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబో రిపీట్ అవుతుంది. వీరిద్దరి కాంబినేషన్ అంటే ఆక్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈనేపథ్యంలోనే ఈసినిమాపై అప్పుడే అంచనాలు ఏర్పడ్డాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాను అధికారికంగా ఎప్పుడో ప్రకటించారు. అయితే ఇన్ని రోజులు రామ్ బోయపాటి శ్రీను సినిమాతో బిజీగా ఉండటంతో ఈసినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. ఇక రెండు రోజుల క్రితమే ఈసినిమాను పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఇక నేటి నుండి రెగ్యులర్ షూట్ ను మొదలుపెట్టారు. ముంబైలో వేసిన ప్రత్యేక సెట్ లో రామ్ ఇంకా ఫైటర్స్ పై భారీ యాక్షన్ సీక్వెన్స్ తో ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టారు. స్టంట్ మాస్టర్ కేచ ఆద్వర్యంలో ఈ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కిస్తున్నారు. ఇద్దరమ్మాయిలు సినిమా నుండి కేచ పూరీతో ట్రావెల్ అవుతూనే ఉన్నాడు. షూటింగ్ నేపథ్యంలో రిలీజ్ చేసిన ఫొటో ఇప్పుడు వైరల్ అవుతుంది.
కాగా ఈసినిమాను పూరి కనెక్ట్స్ పై పూరీ జగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మించనున్నారు. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియచేయనున్నారు. అంతేకాదు ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించేశారు. 2024 మార్చి 8వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: