పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ సినిమా బ్రో. ఈసినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూాడా నటిస్తుండటంతో ఈసినిమా కోసం మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమా షూటింగ్ ను ఫిబ్రవరి నుండి మొదలుపెట్టారు. అప్పటినుండీ వరుస షెడ్యూల్స్ తో శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఇక ఒకవైపు షూటింగ్ పూర్తి చేసుకుంటూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తిచేస్తున్నారు. అంతేకాదు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ ముఖ్యంగా టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. ఇక్కడ టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకొని రీసెంట్ గానే ఒక సాంగ్ షూట్ నిమిత్తం ఆస్ట్రియా వెళ్లారు. ఇక అక్కడ సాంగ్ షూట్ కూడా పూర్తయిపోవడంతో సినిమా షూటింగ్ కూడా పూర్తయిపోయింది. ఈవిషయాన్ని సాయి ధరమ్ తేజ్ ఒక ఫొటో పోస్ట్ చేస్తూ తన ఇన్ట్సా ద్వాారా తెలియచేశాడు. ఆస్ట్రియాలోని అత్యంత సుందరమైన ఇన్స్ బ్రక్ నగరంలో ‘బ్రో’ చివరి షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. ఇలాంటి ఒక సుందరమైన ప్రాంతంలో షూటింగ్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. దీనికి థాంక్స్ అనే మాట ఒక చిన్న పదం మాత్రమే. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన షూటింగ్ అనుభవాన్ని అందించినందుకు మా యూనిట్ మొత్తానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు.
View this post on Instagram
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: