అగ్రహీరో వెంకటేష్ కూడా గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకులను నవ్వించిన వెంకటేష్ ఆ తరువాత ఓరిదేవుడా చిత్రంలో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. ఇక రానా నాయుడు తో డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చేశారు. ఇక ఇప్పుడు మరో సినిమాతో బిజీ అయిపోయాడు. హిట్ సిరీస్ తో మంచి ఫామ్ లో ఉన్న శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకీ హీరోగా వస్తున్న సినిమా సైంధవ్. మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్తో సినిమా కాన్సెప్ట్ ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు టైటిల్ గ్లింప్స్ ఇంకా ఈమధ్య రిలీజ్ చేసిన పోస్టర్ ను చూస్తుంటే ఈసినిమా యాక్షన్ థ్రిల్లర్ రానున్నట్టు అర్థమవుతుంది. ఇక రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించేశారు చిత్రయూనిట్. ఈ ఏడాది డిసెంబర్ 22న పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతుంది ఈసినిమా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ దశలోనే ఉంది. అయితే ఇప్పటి వరకూ ఈసినిమాలో నటించే హీరోయిన్ పై ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు చిత్రయూనిట్. కానీ తాజా సమాచారం ఈసినిమాలో హీరోయిన్ ఫిక్స్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో వెంకీ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నట్లు తెలుస్తుంది. ప్రధాన హీరోయిన్ గా జెర్సీ ఫేం శ్రద్ధ శ్రీనాథ్ను పరిశీలిస్తునట్టు తెలుస్తోంది. డైరెక్టర్ శైలేష్ ఇప్పటికే ఆమెకు కథ చెప్పారని, తను కూడా పాజిటివ్ గా స్పందించిందని సమాచారం సెకండ్ హీరోయిన్గా రుహాని శర్మను ఖరారు చేసినట్టు సమాచారం. మరి దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వెయిట్ చేయాల్సిందే.
కాగా ఈ సినిమాలో వెంకీని శైలేష్ కొలను మునుపెన్నడూ లేని పాత్రలో చూపించబోతున్నాడట. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు నవాజుద్దీన్ సిద్ధికి ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. పాన్ ఇండియా సినిమాగా ఈసినిమా రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: