సినిమా ఇండస్ట్రీ లో ఎవరికి ఏ కష్టం వచ్చిన మొదట స్పందించే వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ఆయన ఎంతో మందికి కష్టాల్లో సాయంచేశారని చాలా సార్లు విన్నాం. ఆందులో భాగంగా తమిళ నటుడు పొన్నంబలంకు సహాయం చేసి తన ఆరోగ్యాన్ని కాపాడారు. ఈవిషయాన్ని స్వయంగా పొన్నాంబలం మే వెల్లడించారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న సమయంలో ఏం చేయాలో తెలియక చిరంజీవి గారికి ఫోన్ చేసి లక్ష లేదా రెండు లక్షలో అడుగుదాం అనుకున్నాను అయితే ఫోన్ చేసి మాట్లాడుతూ .. హాయ్,ఎలా వున్నావు, ఏంటి నీ సమస్య అని చిరంజీవి అడుగగా.. నా ఆరోగ్యం బాలేదు సార్ అని చెప్పా వెంటనే హైదరాబాద్ వస్తారా లేదా చెన్నైలో అపోలో హాస్పిటల్ లో జాయిన్ అవ్వండి నేను చెప్తాను అని చెప్పారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నేను వెళ్లి హాస్పిటల్ లో జాయిన్ అవ్వగా ఎంట్రీ ఫీజు కూడా తీసుకోలేదు. ట్రీట్మెంట్ చేయించుకున్నాక మొత్తం అయిన బిల్ 40లక్షలు. ఈమొత్తాన్ని చిరంజీవి గారే కట్టేశారని ఇప్పుడు నా ఆరోగ్యం కాస్త మెరుగైందని పొన్నంబలం ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు . ప్రస్తుతం దానికి సంబంధించిన క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకుముందు పొన్నాంబళం, చిరంజీవి నటించిన ఘరానా మొగుడు , మెకానిక్ అల్లుడు సినిమాల్లో విలన్ గా నటించారు.
ఇదిలావుంటే ఈసంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ తో వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు చిరంజీవి. ఈ చిత్రం 100కోట్ల షేర్ ను రాబట్టి చిరు స్టామినా ఏంటో చూపించింది. ఇక ప్రస్తుతం చిరు ,బోళా శంకర్ లో నటిస్తున్నాడు. మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో కీర్తి సురేష్ , చిరంజీవికి చెల్లెలిగా కనిపించనుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : :point_down:
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: