స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘శాకుంతలం’. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని వచ్చే నెల 14న విడుదలకు సిద్దమవుతుంది. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. భారీ బడ్జెట్ తో గుణ టీం వర్క్స్ బ్యానర్ పై గుణశేఖర్ కూతురు నీలిమ గుణ ఈ సినిమాను నిర్మించగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈరోజు ఈ సినిమా ఫైనల్ కాపీ చూసిన సమంత సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కొద్దిసేపటి క్రితం సినిమా చూశాను. చాలా బ్యూటిఫుల్ గా వుంది. గుణశేఖర్ గారు గొప్ప ఇతిహాసాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఫ్యామిలీ ఆడియెన్స్ పవర్ ఫుల్ ఎమోషనల్ సీన్లకు ముగ్ధులవుతారు. పిల్లలు కూడా ఈ మ్యాజికల్ వరల్డ్ ను ఇష్టపడతారు అలాగే దిల్ రాజు గారికి మరియు నీలిమకు ధన్యవాదాలు అని సమంత తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
View this post on Instagram
ఇక ఇప్పటికే విడుదలైన ఈసినిమా ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకొని సినిమాపై అంచనాలను పెంచింది. ప్రముఖ నటులు మోహన్ బాబు, ప్రకాష్ రాజ్ ,దేవ్ మోహన్ ,సచిన్ కెడ్కర్ తదితరులు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. మణిశర్మ సంగీతం అందించాడు. తెలుగు తోపాటు తమిళ ,కన్నడ, మలయాళ , హిందీ భాషల్లో ఈచిత్రం విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: