సెన్సేషనల్ హిట్ అర్జున్ రెడ్డి మూవీతో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయిన సందీప్ రెడ్డి వంగా ఆ మూవీ హిందీ రీమేక్ కబీర్ సింగ్ మూవీతో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. హీరో షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా తెరకెక్కిన కబీర్ సింగ్ మూవీ ఘనవిజయం సాధించి భారీ వసూళ్లు సాధించింది. దర్శకుడు సందీప్ ప్రస్తుతం రణ్ బీర్ కపూర్, రష్మిక జంటగా బాలీవుడ్ మూవీ యానిమల్ ను తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సందీప్ కాంబినేషన్ లో స్పిరిట్ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
గతంలో కూడా ప్రభాస్ తో చేయబోయే సినిమా గురించి సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. ప్రభాస్ తో రా అండ్ పవర్ఫుల్ యాక్షన్ సినిమా చేయాలనే తన ఉద్దేశాన్ని సందీప్ వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా దర్శకుడు సందీప్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. హీరో ప్రభాస్తో తాను చేయబోయే తర్వాత చిత్రం పై ఎన్ని అంచనాలు ఉన్నాయో తనకు తెలుసుననీ, ప్రభాస్ కోసం బలమైన మరియు ప్రతిష్టాత్మకమైన స్క్రిప్ట్ ను రాస్తున్నాననీ.. ఆ స్క్రిప్ట్ పవర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ గా ఉంటుందనీ చెప్పారు. హీరో ప్రభాస్ ప్రస్తుతం పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: