హీరో విశాల్ సినిమా జయాపజయాలను పక్కన పెట్టి వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక షూటింగ్ సమయంలో విశాల్ కు ప్రమాదాలు జరగడం కూడా కొత్త విషయం ఏం కాదు. ఆమధ్య లాఠీ సినిమా షూటింగ్ సమయంలో విశాల్ గాయపడిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి సినిమా షుటింగ్ లో గాయపడ్డాడు. అయితే ఈసారి మాత్రం పెద్ద ప్రమాదం నుండే తప్పించుకున్నాడు విశాల్. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా వస్తున్న సినిమా మార్క్ ఆంటోని. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఈనేపథ్యంలో షూట్ జరుగుతుండగా.. ఒక ట్రక్కు అదుపుతప్పి అదే సమయంలో కింద పడి ఉన్న విశాల్ పక్క నుండి వెళ్లింది. తృటిలో ఆయన ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటనలో ఎవరికీ గాయం కాలేదు. ఇక దీనిపై విశాల్ కూడా స్పందిస్తూ.. క్షణకాలంలో, కొన్ని ఇంచుల దూరంలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నానని… భగవంతుడికి ధన్యవాదాలను తెలియజేస్తున్నానని చెప్పారు. ఈ ప్రమాదం తర్వాత మళ్లీ షూటింగ్ లో పాల్గొన్నామని తెలిపాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Jus missed my life in a matter of few seconds and few inches, Thanks to the Almighty
Numb to this incident back on my feet and back to shoot, GB pic.twitter.com/bL7sbc9dOu
— Vishal (@VishalKOfficial) February 22, 2023
కాగా విశాల్ కు జోడీగా రీతూవర్మ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఎస్ జె సూర్య ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈసినిమాలో సునీల్ కూడా ఒక కీలక పాత్రలో నటించే అవకాశం దక్కించుకున్నాడు. మినీ స్టూడియో బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తుండగా.. జి.వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని తమిళంతో పాటు, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో మేకర్స్ రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: