సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. గత ఏడాది సర్కారు వారి పాట సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే మొదలుపెట్టారు. ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తి చేశారు. ఇక ఈసినిమా గురించి నిర్మాత నాగవంశీ పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు. తాను నిర్మించిన సార్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగవంశీ మహేష్ సినిమా గురించి తెలియని విషయాలు తెలియచేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మీ ఫెవరేట్ త్రివిక్రమ్, మహేష్ బాబు గారి కాంబినేషన్ లో, అతడు ఖలేజా తరువాత హైప్ తో వస్తున్న సినిమా.. ఫ్యాన్స్ కు ఎలాంటి ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతున్నారు..?
ప్రతి ఏరియాలో రాజమౌళి గారి నంబర్లకు దగ్గరగా వెళతాం. ప్రస్తుతానికి అయితే నేను ఇదే చెప్పగలను. అలవైకుఠపురములో సినిమాకు అలానే వెళ్లాము. ఇప్పుడు కూడా అలానే వెళతాము అనిపిస్తుంది. నేను విన్న కంటెంట్, చూసిన కంటెంట్ ప్రకారం మ్యాగ్జిమమ్ రాజమౌళి గారి నంబర్ కు దగ్గరగా వెళ్లడానికి ట్రై చేస్తాం..
ప్రస్తుతం యాక్షన్ మోడ్ సినిమాలు నడుస్తున్నాయి..మీరు కూడా ముందు యాక్షన్ మోడ్ అనుకొని తరువాత మార్చి ప్యామిలీ స్టోరీలోకి వచ్చారని అంటున్నారు..?
కె.జి.యఫ్ స్టంట్ మాస్టర్స్ తో యాక్షన్ సీన్ తీసి దానిని వద్దనుకున్న మాట నిజమే. అయితే మేము ఎంత ప్రెజర్ లో ఉంటామో చెప్పాం. మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వస్తుంది.. అలా వైకుంఠపురములో తరువాత డైరెక్టర్ చేస్తున్న సినిమా ఇది.. ఇన్ని బ్యారియర్స్ ను మైండ్ లో పెట్టుకొని జనాలకు నచ్చే సినిమా అవ్వాలి అది.. సో దానికి ఏది నచ్చితే అది చేద్దామని కాస్త టైమ్ తీసుకొని సెట్స్ పైకి వెళ్లాం.. ఒక యాక్షన్ సీక్వెన్స్ అనుకున్నాం.. కానీ ఆ యాక్షన్ సీక్వెన్స్ మేము అనుకున్నట్టు రాలేదు సో తీసేశాం.. ఇవన్నీ కామన్.
మహేష్ గారి సినిమాల్లో ఫ్యామిలీ ఇంకా మెసేజ్ ఒరియెంటెడ్ సినిమాల్లో చూశారు.. ఇప్పుడు మెసేజ్ ఒరియెంటెడ్ సినిమాలు వద్దంటున్నారు.. దీనిపై ఫ్యాన్స్ కు మీ క్లారిటీ.. ?
త్రివిక్రమ్-మహేష్ బాబు గారు ఎలాంటి సినిమాలు తీయాలని మీరనుకుంటున్నారు. ట్విట్టర్ లో కూడా ఫ్యామిలీ సినిమా అంటే మళ్లీ ఫ్యామిలీ సినిమానా అంటున్నారు.. త్రివిక్రమ్-మహేష్ ఎలాంటి సినిమా తీస్తే బావుంటుంది అనుకున్నారు.. లోకేష్ ఆల్రెడీ విక్రమ్ తీసేశాడు అయిపోయింది.. మనం కూడా విక్రమ్ లాంటి సినిమా తీసి ఏం చేయాలి.. ఫ్యాన్స్ కూడా విక్రమ్ ఆడింది.. విక్రమ్ కావాలి.. అనిరుథ్ స్కోర్ బాగా కొట్టాడు.. ఏం చేద్దాం దానికి.. మహేష్-త్రివిక్రమ్ సినిమా అంటే ఎలా ఉంటుందో అన్నిఎలిమెంట్స్ తో ఈసినిమా వస్తుంది.
థమన్ కంపోజ్ చేసిన ట్రాక్స్ కూడా మహేష్-త్రివిక్రమ్ కు అంతలా నచ్చలేదన్న వార్తలు సర్కిలేట్ అవుతున్నాయి.. దీనిపై మీ సమాధానం..?
మేమే ఆ వార్తలు విని చాలా షాకయ్యాం. ఎందుకంటే థమన్ ఇంకా కంపోజిషనే స్టార్ట్ చేయలేదు.. అలాంటిది ఈవార్తలు ఎలా వచ్చాయో మాకే అర్థం కాలేదు.. డైరెక్టర్, థమన్ ఇంకా మ్యూజిక్ సెట్టింగ్స్ పైనే కూర్చోలేదు.. త్రివిక్రమ్ గారు వేరే పనుల్లో బిజీగా ఉన్నారు.. అప్పుడే ఇలాంటి రూమర్లు రావడంతో మేమే షాక్ అయ్యాం.
కాగా ఈసినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తుంది. శ్రీలీల కూడా మరో హీరోయిన్ గా నటిస్తుంది. దీనితో పాటు మధి కెమెరామెన్గా, నవీన్ నూలి ఎడిటర్గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమా రిలీజ్ డేట్ కూడా ముందే ప్రకటించారు. 2023 ఏప్రిల్ 28వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: