విమల్ కృష్ణ దర్శకత్వంలో యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా డీజే టిల్లు. ఈసినిమా ఫిబ్రవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా పెద్ద హిట్ అయింది. కలెక్షన్ల పరంగా కూడా సాలిడ్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా సిద్దు జొన్నలగడ్డ తన టైమింగ్ తో బాడీ లాంగ్వేజ్ తో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాకు సీక్వెల్ కూడా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభించారు. అయితే ఈసినిమాలో హీరోయిన్ పై ఇప్పటివరకూ సస్పెన్స్ నెలకొంది. ముందు ఈసినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది అన్నారు. ఆ తరువాత ఆమె పలు కారణాల వల్ల తప్పుకుంది. ఆ తరువాత అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది అన్నారు. అయితే ఆమె కూడా తప్పుకుందని అన్నారు.. రీసెంట్ గా మీనాక్షి చౌదరి నటిస్తుందన్న వార్తలు వచ్చాయి. దీంతో ఈ సినిమాలో ఎవరు నటిస్తారా అని చూస్తున్నారు. అయితే ఫైనల్ గా ఈసినిమా హీరోయిన్ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఈసినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ నటిస్తున్నట్టు చిత్రయూనిట్ కన్ఫామ్ చేసింది.
View this post on Instagram
ఇక ఈసినిమాను కూడా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈసినిమాకు సంబంధించిన వివరాలు త్వరలో తెలియచేయనున్నారు. మరి డీజే టిల్లు అయితే సూపర్ హిట్ అయింది. ఈసీక్వెల్ ఎలా ఉంటుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: